వేదిక శాశ్వతం!
Published Tuesday, 22 November 2016విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ నగరం శాశ్వత వేదికగా జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ను ప్రతి ఏడాది నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో యువత ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో మంచి క్రీడాకారులుగా రాణించాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు కమిటీల అధ్యక్షులు, ప్రతినిధులతో ఆయన సమావేశమై అథ్లెటిక్స్ నిర్వహణకు నగరంలో చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.