అతిసార వ్యాధిబారిన పడిన విద్యార్థులకు జిల్లా వైద్యాధికారి పరామర్శ
Published Tuesday, 25 October 2016జహీరాబాద్టౌన్, అక్టోబర్ 25: అతిసారతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన చికిత్సలు అందించాలని జిల్లా వైద్యారోగ్య అధికారి గాయత్రిదేవి స్థానిక వైద్యులను ఆదేశించారు. స్థానిక ఎస్సీ సాంఘీక సంక్షేమ హాస్టల్లోఅతిసార వ్యాధితో అస్వస్థతగు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆమె పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటలో ఉండాలన్నారు. అనంతరం ఆమె స్థానిక హాస్టల్ను సందర్శించారు.