రేషన్ డీలర్లు నెలాఖరుకు బిఎఫ్డి పూర్తిచేయాలి:ఆర్డీవో
Published Tuesday, 25 October 2016దేవరపల్లి, అక్టోబర్ 25: రేషన్ షాపు డీలర్లంతా విధిగా ఈ నెలాఖరునాటికి బిఎఫ్డి పూర్తిచేయాలని కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు రేషన్ షాపు డీలర్లను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం రేషన్ డీలర్లు, గ్యాస్ కంపెనీ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్డీవో హాజరై ప్రసంగించారు. దేవరపల్లి మండలంలో బిఎఫ్డి 81.89 శాతం ఉందని, దీనిని 85 శాతానికి పూర్తిచేయాలన్నారు. ఈ మండలం జిల్లాలో వెనుకబడి ఉందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇన్ఛార్జి డీలర్లు సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని ఆయన హెచ్చరించారు.