నియంతలా వ్యవహరిస్తున్న కెసిఆర్
Published Tuesday, 25 October 2016మిర్యాలగూడ, అక్టోబర్ 25: నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తు ఉద్యమాలు, పార్టీలను అణచివేసేందుకు యత్నిస్తున్నారని అదే విధంగా తాము తెలంగాణా ఉద్యమాన్ని అణచివేస్తే సిఎం అయ్యేవాడా అని రాష్ట్ర సిఎల్పి నాయకులు కుందూరు జానారెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రైతుల రుణమాఫీ ఒకేసారి చేయాలని, ఫీజు రీఇంబర్స్మెంట్ చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు.