కార్పొరేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు
Published Wednesday, 26 October 2016తాడేపల్లిగూడెం, అక్టోబర్ 25: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. రూరల్ మండలం ఆరుగొలను సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల 3వ జోనల్ క్రీడా మహోత్సవాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల 13 పాఠశాలల, కళాశాలల 600 మంది క్రీడాకారులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుతారన్నారు. క్రీడల్లో విద్యార్థుల ప్రతిభను నిరూపించుకుని ప్రపంచ స్థాయిలో క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు.