కూరగాయల సాగుపై అవగాహన అవసరం
Published Tuesday, 25 October 2016ఆసిఫాబాద్, అక్టోబర్ 25: వచ్చే కరీఫ్ సీజన్లో పత్తి పంట సాగు తగ్గించి అంతర్ పంటలను పండించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుండే ప్రణాళిలకలను రూపొందించుకోవాలని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. కూరగాయల సాగుపైనా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా ఈసీజన్లో 1.30లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని కలెక్టర్ తెలిపారు.