వైద్యశాఖ అప్రమత్తం
Published Monday, 26 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆసాధారణంగా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖను అప్రమత్తం చేసినట్టు, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. జిల్లాల వారిగా డిఎంహెచ్ఓలు సమీక్షలు చేస్తున్నారు. వర్ష తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలవారీగా దానికి తగ్గట్టు సిద్ధమవుతున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వైద్య సహాయంపై అధికారులు చర్చించారు. మందులు, డాక్టర్లు, 104 వాహనాలు సిద్ధంగా ఉంచినట్టు, అవసరమైనచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.