ఎమ్మెల్యే భూమాపై రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధం!
Published Monday, 26 September 2016కర్నూలు, సెప్టెంబర్ 25: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఆయనపై సుమారు రెండేళ్ల క్రితం పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఆ కేసులో భూమా నాగిరెడ్డి రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆయన వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయనను మంత్రివర్గంలో చేర్చుకుంటారని ప్రచారం జరిగింది.