డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి
Published Monday, 26 September 2016సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : మండలంలోని మైనంపాడు బిసి కాలనీకి చెందిన రావులపల్లి లలిత డెంగ్యూ జ్వరంతో గత రాత్రి మృతి చెందింది. ఈ బాలిక స్థానిక హైస్కూల్లో ఏడో తరగతి చదువుతూ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో గత రెండు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు ఒంగోలు రిమ్స్కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం మరో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లలిత తల్లిదండ్రులు చెంచలరావు, రమణమ్మలు చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులు.