S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి

సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : మండలంలోని మైనంపాడు బిసి కాలనీకి చెందిన రావులపల్లి లలిత డెంగ్యూ జ్వరంతో గత రాత్రి మృతి చెందింది. ఈ బాలిక స్థానిక హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతూ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో గత రెండు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం మరో హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లలిత తల్లిదండ్రులు చెంచలరావు, రమణమ్మలు చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులు.

రామాయపట్నం పోర్టు సాధన పట్ల జిల్లా నేతలకు చిత్తశుద్ధి లేదా?

ఒంగోలు,సెప్టెంబర్ 25:ప్రకాశం జిల్లాకే తలమానికంగా నిలిచే రామాయపట్నం పోర్టు నిర్మాణ సాధనపై నెల్లూరు జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలకున్న శ్రద్ధ జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఎందుకులేదన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుండే వెల్లువెత్తుతున్నాయి. రామాయపట్నం పోర్టు సాధనయాత్ర పేరుతో నెల్లూరు వైకాపా పార్లమెంటుసభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలి నుండి యాత్ర బయలుదేరి రామాయపట్నం వరకు జరిగింది. ఈ యాత్రలో ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.

‘రాజకీయ’ దండయాత్ర?

శ్రీకాకుళం: రాజకీయ చాణుక్యుడు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంపై చేస్తున్న పొలిటికల్ దండయాత్ర..అన్నీ దిక్కుల నుంచి అష్టదిగ్బంధం చేసే వ్యూహాం..గుండ రాజకీయాలు బలహీనపరిచే పన్నాగం..అభివృద్ధి సూత్రం - వౌలిక మంత్రం మధ్య జరిగే వైరానికి సాక్షీభూతం. అదే - ధర్మాన రాజకీయ యుద్ధం. కత్తిపట్టకుండానే కాలంతోపాటు రాజకీయ చరిత్ర కరిగిపోయేలా వేసే కుయుక్తులే - ధర్మాన దండయాత్ర!

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను కలిసిన కలెక్టర్!

శ్రీకాకుళం, సెప్టెంబర్ 25: ప్రభు త్వం ముందస్తు వాతావరణ హెచ్చరికలతో జిల్లాకు చేరిన జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సహాయ కమాండెంట్ డి.కె.సాహు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీనృసింహంను ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వర్షాల పరిస్థితి, జిల్లాలో ప్రభావంపై విపులంగా చర్చించారు. భారీ వర్షాలు కురవచ్చునే సూచనలతో కటక్ నుంచి ఈ బృందం శనివారం ఉదయం జిల్లాకు చేరుకుంది. 21వ శతాబ్ది గురుకులంలో ప్రస్తుతం 80 మంది సభ్యులుగల ఈ దళం వేచి ఉంది. ఎక్కడైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే అచ్చక రిస్క్యూ ఆపరేషన్ చేయుటకు సిద్ధంగా ఉంది.

విద్యా వ్యవస్థలకూ సింగిల్ విండో అనుమతులు

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: పరిశ్రమలకు ఇచ్చే విధంగా విద్యా సంస్థలకి సింగిల్‌విండో అనుమతులకు సిద్ధం చేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఇక్కడి ఎన్‌ఎడి దరి ఉమయిన్ భవనంలో ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో (అవుస్మా) ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉన్నత ప్రమాణాల కోసం అనుసరించాల్సిన వివిధ అంశాలపై అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గంటా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎడ్యుకేషనల్ నాలెడ్జి హబ్‌గా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారని అన్నారు.

జల‘సిరి’

దేవరాపల్లి, సెప్టెంబర్ 25: దేవరాపల్లిలో శనివారం రాత్రి భారీ వర్షం పడింది. ఇటువంటి వర్షం ఈ ఏడాది ఎప్పుడు పడలేదని మండల ప్రజలు అనుకుటుంటున్నారు. శనివారం వర్ష ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో 1700 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. శనివారం రాత్రి 83 మిల్లీమీటర్లు వర్షం పడడంతో మరలా జలాశయంలో వరదనీరు వచ్చి చేరుతుంది. పినకోట, సమ్మెద గెడ్డల నుంచి వరదనీరు 2800 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరడంతో అంతే నీటిని మూడు గేట్లు ద్వారా విడుదల చేసినట్లు జలాశయ డిఈఈ ఏ.సునీత తెలిపారు. రైవాడ జలాశయం అత్యధిక నీటిమట్టం 114 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 113.50 మీటర్లు ఉంది.

ప్రజలకు అత్యంత చేరువుగా బిజెపి

అనకాపల్లి(నెహ్రూచౌక్), సెప్టెంబర్ 25:రానున్న రోజుల్లో ప్రజలకు అత్యంత చేరువైన పార్టీగా బిజెపి పుంజుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అన్నారు. స్థానిక వివేకానంద హాలులో ఆదివారం పండిట్ దీనదయాళ్ 100వ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకులు వై. సత్యారావు, తోట విజయలక్ష్మి మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆదర్శంతోనే భారతీయ జనతాపార్టీ ప్రజలకు అనేక సేవలను అందిస్తుందని, ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టార న్నారు.

పాచిన లడ్డూలు వద్దు..

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ప్రత్యేక హోదా ఇమ్మంటే రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ వాఖ్యలే ప్రాధాన్యంగా కరపత్ర పోరుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు హోదా కోసం పట్టుపట్టిన వెంకయ్య నాయుడు తీరుపై ఇటీవల కాకినాడ సభలో నిప్పులు కురిపించిన పవన్ కల్యాణ్ హోదాపై పోరుకు జనసేనను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడ సభలో పవన్ చేసిన వాఖ్యలే ప్రాధాన్యంగా కరపత్రాలతోప్రచారం చేయాలని ఆదివారం నాడిక్కడ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు.

సందర్శకులకు నిరాశ!

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు నిరాశకు గురిచేసింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సీ ఫుడ్ షో ముగింపు రోజు ఆదివారం ఎగ్జిబిషన్‌కు సందర్శకులను అనుమతిస్తామని నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. ఎంపెడా, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌ను సందర్శించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఒక పక్క జోరున వర్షం కురుస్తున్నప్పటికీ పిల్లలతో పాటు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

నిధులున్నా... పనులు సున్నా!

బుచ్చెయ్యపేట, సెప్టెంబర్ 25: పాఠశాలల్లో వంటశాలలు నిర్మాణానికి పుష్కలంగా నిధులున్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల అలసత్వమైతే నేమి, స్థానిక ఉన్న సర్పంచ్‌లు, స్కూల్ కమిటీలు సహకరించకపోవటంతో వంటశాలల నిర్మాణాలు జరగక, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడరానిపాట్లు పుడుతున్నారు. మండలంలోని విజయరామరాజుపేట జెట్టి పాపయ్యమ్మ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వంటశాల నిర్మాణం నిమిత్తం లక్షా యాబైవేల రూపాయలు మంజూరు చేసి రెండేళ్లయినప్పటికీ, నేటికి ఈ వంటశాల నిర్మాణం చేపట్టకపోవటంపై ఇటీవల ఆ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులున్నా..

Pages