S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరమైతే సైనిక హెలీకాప్టర్లు

భద్రాచలం, సెప్టెంబర్ 25: గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు సైనికహెలీకాప్టర్లను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఐటిడిఏ పిఓ చాంబర్‌లో ఆదివారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాదులో హెలీకాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆర్మీని కూడా పంపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.

కొలిక్కి వచ్చిన లెక్కలు

భద్రాచలం, సెప్టెంబర్ 25: జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండుగా చీలనున్న ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటుగా, నూతన జిల్లా కొత్తగూడెం లెక్కలు ఒక కొలిక్కి వచ్చాయి. జనాభా మొదలు అక్షరాస్యత, పాడి పంటలు, భూములు, పరిశ్రమలు, గనులు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల లెక్కలు తేల్చేశారు. 22 మండలాలు, 21 మండల పరిషత్‌లతో 4595 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో ఖమ్మం, 18 మండల పరిషత్‌లు, 18 మండలాలతో 8284 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నూతనంగా కొత్తగూడెం జిల్లా ఆవిర్భవిస్తున్నాయి.
కొత్తగూడెం

రోడ్డు ప్రమాదాలపై దండయాత్ర

కర్నూలు, సెప్టెంబర్ 25:రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ చేపట్టామని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని వ్యాస్ ఆడిటోరియంలో ‘రోడ్డు ప్రమాదాలపై దండయాత్ర’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ దాదాపు 5 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎస్పీతో పాటు డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 2013లో 1,661, 2014లో 1,786, 2015లో 1,845, 2016లో 1,301 ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నాయన్నారు.

జలాశయాలకు జలకళ..

కర్నూలు, సెప్టెంబరు 25:జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 879.7 అడుగలకు చేరింది. అలాగే వెలుగోడు రిజర్వాయర్‌లో రికార్డుస్థాయిలో నీరు చేరింది. కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం రాత్రి 8గంటల సమయానికి 879.7 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టిఎంసిలకు గానూ 185.85 టిఎంసిలకు చేరుకుంది.

నేడు డెయిరీ డైరెక్టర్ల ఎన్నికలు

నెల్లూరు, సెప్టెంబర్ 25: విజయా డెయిరీ పాలకవర్గంలో మూడు డైరెక్టర్ పదవులకు ఏర్పడిన ఖాళీకి సంబంధించి సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు అధికారిగా వరదారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన వారిని ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. జిల్లాలోని కొడవలూరు మండలం నార్తురాజుపాలెం, తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ఆములూరు, ఆత్మకూరు మండలం వాశిలికి చెందిన డైరెక్టర్ల స్థానాలు ఈనెల 30వ తేదీకి ఖాళీ అవుతున్నాయి.

అందరి చూపు షార్ వైపు

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 25: ఒకే రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రెండు కక్ష్యలోకి ప్రవేశపెట్టనుండడంతో ప్రపంచ దేశాల చూపంతా షార్ వైపే ఉంది. ఇస్రో శాస్తవ్రేత్తలు షార్ కేంద్రం నుండి ప్రతి ప్రయోగంలో ఏదోఒక కొత్తదనంతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి ఏకంగా ప్రపంచంలో ఏ దేశాలు చేపట్టని విధంగా ఒకే రాకెట్ ద్వారా రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి-సి 35 వాహక నౌక ద్వారా రోదసీలో పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు తన నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి వాహక నౌకనే ఎంచుకోవడం విశేషం. అంతేకాకుండా ఈ ప్రయోగం 2:15 గంటలపాటు రాకెట్ పయనించేలా రూపకల్పన చేయడంతో అందరి చూపు ప్రయోగం పైనే పడింది.

మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి

కందుకూరు రూరల్, సెప్టెంబర్ 25: స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌లో వాషర్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం శ్రీరామమూర్తి విధి నిర్వహణలో ఉండగా బస్సు డీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందడంతో అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు అధ్యక్షతన నాయకులు ఐదు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం డిపో మేనేజర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్పందించి నాలుగు డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

బిసి యువత విదేశీ విద్యకు నిధులు విడుదల

మార్కాపురం, సెప్టెంబర్ 25: వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర టిడిపి కార్యదర్శి, రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెయ్యి మందికి ఒక్కొక్కరికి 10లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, దానికితోడు బ్యాంకుల నుంచి మరో 10లక్షల రూపాయలు రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

కార్పొరేట్ విద్యాసంస్థలపై ఐక్యంగా పోరాటం

ఒంగోలు అర్బన్,సెప్టెంబర్ 25:రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎపి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చైతన్య హరిబాబు అన్నారు. ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంసిఎ భవన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఉపయోగపడే విధంగాప్రభుత్వం నిబంధనలు రూపొందించి చిన్న స్కూల్స్ ఉనికినే లేకుండా చేస్తున్నాయని విమర్శించారు.

ప్రైవేట్ బస్సు బోల్తా

సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : సంతనూతలపాడులోని మైనంపాడు డొంక సమీపంలోని అనంతపురం నుండి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఆదివారం ఉదయం బోల్తాపడిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం నుండి విజయవాడ వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నూతలపాడు చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో మార్జిన్‌లోకి రావడంతో బస్సు పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాషా సంఘటనాస్థలానికి చేరుకుని 108 ద్వారా క్షతగాత్రులను ఒంగోలుకు తరలించారు.

Pages