అవసరమైతే సైనిక హెలీకాప్టర్లు
Published Monday, 26 September 2016భద్రాచలం, సెప్టెంబర్ 25: గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు సైనికహెలీకాప్టర్లను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఐటిడిఏ పిఓ చాంబర్లో ఆదివారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాదులో హెలీకాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆర్మీని కూడా పంపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.