‘వెలుగొండప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి’
Published Tuesday, 20 September 2016ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 19: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఈసందర్భంగా జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలని, ఎకరాలకు 19లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, నిర్వాసితులకు డబుల్బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.