S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆంధ్రాబ్యాంకు శాఖలో చోరీకి యత్నం

హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం అర్ధరాత్రి చోరీకి ఇద్దరు దుండగులు విఫల యత్నం చేశారు. షట్టర్‌ను తొలగించి బ్యాంకు లోపలికి వచ్చిన వారు స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు యత్నించారు. బ్యాంకు నుంచి వారు వెనుదిరుగుతున్న సమయంలో ఓ ఆగంతకుడు గస్తీ పోలీసులకు చిక్కాడు. దుండగులిద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందినవారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

బిజెపి వల్లే ఎదిగా: వెంకయ్య

హైదరాబాద్: తాను రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పదవులను చేపట్టినా అందుకు తల్లిలాంటి భారతీయ జనతా పార్టీయే కారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భావోద్వేగంతో అన్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యాలయంలో సన్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం, ప్రజల కోసం తాను నిరంతరం పనిచేస్తానని అన్నారు. ఎంతోమంది నేతలకు పార్టీ ద్వారానే మంచి అవకాశాలు లభించాయన్నారు. ప్రజల కోసం కార్యకర్తలు, నాయకులు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళ నుంచి 7 లక్షల నగదు, నగలు దోపిడీ

హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ నుంచి ఏడు లక్షల రూపాయల నగదు, నగలను ఆగంతకులు దోచుకున్న ఘటన నేరేడ్‌మెట్ గోకుల్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు లాకర్ నుంచి నగదు, నగలు తీసుకుని వస్తుండగా దుండగులు వెంబడించి ఆమె హ్యాండ్‌బ్యాగును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆగంతకుల కోసం ఆరా తీస్తున్నారు.

ఇద్దరు పిల్లలను హతమార్చిన యువకుడు

హైదరాబాద్: సెల్‌ఫోన్ చోరీ చేసిన విషయం చెప్పేస్తారన్న భయంతో ఓ యువకుడు ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన నగర శివారులోని హయత్‌నగర్‌లో శుక్రవారం వెలుగు చూసింది. సోహాన్ అనే యువకుడు రామ్‌కుమార్‌కు చెందిన సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. ఈ విషయం రామ్‌కుమార్ పిల్లలు ధన్‌రాజ్, ముఖేష్‌లకు తెలిసిపోయింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలను బండరాయితో మోది సోహాన్ హత్యచేశాడు. సాక్ష్యాధారాలు లభించడంతో సోహాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్టీసీ స్థితిగతులపై కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో లాభనష్టాలు, తాజా స్థితిగతులపై సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. నష్టాలను అధిగమించలేకుంటే ఆర్టీసీని మూసి వేయడం ఉత్తమమని సిఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఎఎస్పీ మృతిపై సిబిసిఐడి విచారణ ప్రారంభం

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సిబిసిఐడి అధికారులు శుక్రవారం ఉదయం విచారణ ప్రారంభించారు. పాడేరులోని ఆయన అధికారిక నివాసంలో సాక్ష్యాధారాలను సేకరించారు. ఎఎస్పీ ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తూ రివాల్వర్ పేలిందా? అన్న అనుమానాలు రావడంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిబిసిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఈ 30 ఏళ్ల యువ ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన బలంగా వినిపిస్తోంది. తమిళనాడులోని సేలం జిల్లా నుంచి వచ్చిన శశికుమార్ కుటుంబ సభ్యులను కూడా సిఐడి పోలీసులు విచారిస్తారు.

ఝార్ఖండ్‌లో ఎదురుకాల్పులు: జవాను మృతి

రాంచీ: ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా పతర్‌చప్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోలు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. ఇంతలో మావోలు ఒక్కసారిగా కాల్పులు జరపగా ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. జవాన్లు వెంటనే తేరుకుని కాల్పులు ప్రారంభించగా మావోలు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

హైదరాబాద్‌లో 43 ప్రైవేటుబస్సులు సీజ్

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకునేందుకు ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు నగర శివారులో తనిఖీలను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ వద్ద 23 బస్సులను, హయత్‌నగర్, పెద అంబర్‌పేట వద్ద 20 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

గుల్బర్గ్ హత్యాకాండలో 11మందికి యావజ్జీవం

గాంధీనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 11 మంది దోషులకు న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. గుజరాత్‌లోని గుల్బర్గ్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యలు చేసినట్లు రుజువైనప్పటికీ అంతకుముందు ఎలాంటి నేరచరిత్ర లేనందున ఈ 11 మందికి ఉరిశిక్ష వేయలేకపోతున్నట్లు కోర్టు పేర్కొంది. ఇదే కేసులో మరో 13 మందికి ఏడేళ్ల చొప్పున జైలుశిక్షలు విధించింది. సాక్ష్యాలు లేనందున 36 మందిని గతంలోనే నిర్దోషులుగా విడిచిపెట్టారు.

Pages