మహాగణపతి విగ్రహప్రతిష్ఠకు భూమిపూజ
Published Friday, 17 June 2016హైదరాబాద్: ఖైరతాబాద్లో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఖైరతాబాద్లో విగ్రహం ఎత్తును తగ్గించాలని పోలీసులు ఒత్తిడి తేవడాన్ని తాము సహించేది లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ హెచ్చరించింది. భక్తుల మనోభావాలను గౌరవించేలా ప్రభుత్వం పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కమిటీ సభ్యులు కోరారు.