మంచినీటి కోసం ఎదురుచూపులు!
Published Monday, 16 May 2016తోట్లవల్లూరు, మే 15: అధికారుల నిర్లక్ష్యానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మంచినీళ్ల కోసం నానాతంటాలు పడుతున్నారు. వేలాది రూపాయలు జీతాలు పొందుతూ, చేసిన పనులకు పర్సంటేజీలు తు.చ.తప్పకుండా తీసుకుంటూ నిరుపేదలకు అవసరమైన మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించటం ఎంత దారుణమో అధికారులు ఆలోచించుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తీసుకునే జీతాలకు సరిపడా కాకపోయినా కనీసం కొంత భాగమైనా విధి నిర్వహణపై బాధ్యత చూపించేవారే కరవయ్యారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో ఆర్డబ్ల్యుఎస్ శాఖ నిర్లక్ష్య వైఖరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.