ఆన్లైన్లో పట్టాదార్ పాస్పుస్తకాలు
Published Monday, 16 May 2016వలిగొండ, మే 15: ఏండ్లకొద్ది రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొవడం ప్రారంభించింది. అందులో భాగంగా ఆన్లైన్లో పట్టాదార్ పాస్పుస్తకం విధానం ప్రవేశపెట్టనుంది. దీనితో రైతులు పాస్పుస్తకాలు, పహాణీలకై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయే అవకాశం ఉంది. భూమిని కొనుగొలు చేసిన, వారసులకు పట్టామార్పిడి చేసిన తిరిగి కొత్త పాస్పుస్తకం పొందాలంటే రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి రైతులు ఎదుర్కోనేవారు.