హేమసముద్రం రిజర్వాయర్తో పంట పొలాలకు కృషా ణజలాలు
Published Monday, 16 May 2016మహబూబ్నగర్, మే 15: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా హేమ సముద్రం రిజర్వాయర్ను నిర్మించి రైతుల పంట పొలాల్లోకి కృష్ణాజలాలను పారిస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండలంలో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మీషన్కాకతీయ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షేక్పల్లి గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో మేడికుంట చెరువులో మీషన్కాకతీయ పనులను ప్రారంభించారు. అయోధ్యనగర్లో రూ.28లక్షల వ్యయంతో కాసుల చెరువు వేపూర్ గ్రామంలోని రూ.22.36లక్షలతో కొత్తకుంట చెరువు, ఇదే గ్రామంలో రూ.33.20లక్షలతో ఊరకుంట చెరువు పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.