పోస్ట్ ప్రొడక్షన్లో 4జి
Published Sunday, 15 May 2016శ్రీ సాయిలక్ష్మీ మూవీస్ పతాకంపై ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రేమలో ఉన్న నలుగురు ఆ ప్రేమతో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు? చివరికి ఎటువంటి పరిణామాలకు వారి జీవితం దారితీసింది? అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.