స్మరించినంతనే కరుణించే నారసింహుడు
Published Sunday, 15 May 2016శ్రీ మహావిష్ణువు భక్తజనోద్ధరణార్థం భూలోకంలో రకరకాల రూపాలతో అవతరించాడు. ఈ అవతారాలు ఇరవై ఒకటైనా ముఖ్యమైన దశావతారాల్లో కొన్ని అంశావతారాలు. కొన్ని ఆవేశ అవతారాలు. కొన్ని పరిపూర్ణ అవతారాలుగా మహర్షులు అభివర్ణించారు. అన్నింటి కన్నా నాల్గవదైన ఆవేశ అవతారమైన నృసింహావతారం విశిష్టమైంది. విశేషమైం దీ. అదే ‘నర-సింహ’ రూపాల కలయిక.
‘మృగాలలో సింహాన్ని నేను’ అని భగవద్గీతలో కృష్ణ్భగవానుడు చెప్పాడు. కేవలం దుష్టశిక్షణ, శిష్ట రక్షణల కోసమే కాకుండా తన సర్వాంతర్యామిత్వాన్ని చాటిచెప్పే నృసింహావతారం ఎంతో విఖ్యాత మైన విభవాతారం. ఇది విష్ణువు యొక్క సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వాలకు నిదర్శన రూపమైన పూర్ణావతారం.