ఆసియా బాడ్మింటన్ చాంపియన్షిప్ సెమీస్లో సైనా అవుట్
Published Sunday, 1 May 2016ఉహాన్ (చైనా), ఆగస్టు 30: భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ తన కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న వాంగ్ ఇహాన్ను ఢీకొని, 16-21, 14-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ తరఫున బరిలోకి దిగిన మిగతా వారంతా ఇంతకు ముందే నిష్క్రమించారు. సైనా ఓటమితో భారత్ పోరాటానికి తెరపడింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న సైనా పూర్తిగా కోలుకున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ, కీలక మ్యాచ్ల్లో రాణించలేకపోతున్నది.