‘నీట్’పై సవాలుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం
Published Sunday, 1 May 2016హైదరాబాద్, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సంబంధించి తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని సుప్రీంకోర్టు శనివారం మరో మారు స్పష్టంగా చెప్పినా, రానున్న రోజుల్లో విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకుంటుందనే ఆశాభావాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క నీట్ తొలి దశ పరీక్ష పూర్తికాగానే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ఎమ్సెట్ పూర్తయిందని, దానికి ఎలాంటి ఢోకా ఉండబోదని అధికారులు చెబుతున్నారు.