S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టాలు చేయగానే సరికాదు..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పార్లమెంటులో, శాసన సభల్లో చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు కొత్త చట్టాలను చేసేటప్పుడు ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు. జడ్జీల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోజడ్జి చట్టాలు చేయడం కాక వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని ప్రభుత్వానికి హితవు చెప్పడం గమనార్హం.

రియల్ ఎస్టేట్ రంగం ఇక ఉరకలు!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఫ్లాట్ కొనుగోలుదారులు ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తోంది. కార్యాచరణ నియమాలు, నియంత్రణ అధికార వ్యవస్థ (రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటు, పునర్వివిచారణ న్యాయ స్థానాలు (అప్పెల్లెట్ ట్రిబ్యునల్స్) పని మే 1నుంచి ప్రారంభం అవుతాయని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ శనివారం ప్రకటించింది. రియల్ ఎస్టేట్ చట్టానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇక ప్రభుత్వోద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదు. అధికారులను కలిసి అభ్యర్థించాల్సిన అవసరం లేదు. పోలీసు వెరిఫికేషన్ కోసం ఇక లంచాలు ఇవ్వాల్సిన అక్కర లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఇక ఆన్‌లైన్ ద్వారానే భర్తీ కానున్నాయి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూల అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు మీ అర్హతను బట్టి ఉద్యోగం వచ్చేస్తుంది.

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

బళ్లారి, ఏప్రిల్ 30: కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థినులు సహా తొమ్మిది మంది మృతిచెందారు. చెళ్లకెర తాలూకాలో జాతీయ రహదారిపై క్రూయిజర్ వాహనాన్ని కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్రూయిజర్ డ్రైవర్ సహా బళ్లారికి చెందిన ఎనిమంది విద్యార్థినులు మృతి చెందారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాలి

ఆక్లాండ్, ఏప్రిల్ 30: భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. భారత్ అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్’ విధానం ఇప్పుడు ‘లుక్ యాక్ట్’గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రణబ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లో తొలిసారి మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం ఆక్లాండ్ చేరుకున్న అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ, భారతదేశ వ్యూహాత్మక ఆలోచనలు, ఆర్థిక కార్యకలాపాల్లో న్యూజిలాండ్ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. పసిఫిక్ ప్రాంత దేశాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యత గురించి ప్రణబ్ ఈ సందర్భంగా వివరించారు.

ఆంధ్రా లేసును మింగేస్తున్న డ్రాగన్!

భీమవరం, ఏప్రిల్ 30: ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో హొయలొలికిన ఆంధ్రా లేసు ఉత్పత్తులు ప్రస్తుతం చైనా నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కుదేలవుతున్నాయి. చైనాలో యంత్రాలపై తయారైన లేసు ఉత్పత్తుల ముందు చేతి అల్లికలపై ఆధారపడిన ఆంధ్రా లేసు ఉత్పత్తులు వెలవెలబోతున్నాయి. ధర తక్కువగా ఉండటం, నిర్ణీత సమయంలో సరఫరా చేస్తుండటంతో చైనా లేసు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏలుతున్నాయి. నిజానికి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆంధ్రా లేసు ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉండేది.

కొనేందుకు ఒక్కరూ రాలేదు

ముంబయి, ఏప్రిల్ 30: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకర్ల పరిస్థితి ‘మూలిగే నక్క మీద తాటిపండు’ పడ్డ చందంగా మారింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిలు రావాల్సి ఉన్నది తెలిసిందే. అయితే రుణాల వసూళ్లలో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తనఖా పెట్టిన ఆస్తులను శనివారం వేలం వేసిన బ్యాంకర్లకు దిమ్మ తిరిగిపోయే స్పందన ఎదురైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్తుల కొనుగోలుకు ముందుకు రాలేదు మరి.

వరుస లాభాలకు బ్రేక్

ముంబయి, ఏప్రిల్ 30: వరుస రెండు వారాల లాభాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 231.52 పాయింట్లు కోల్పోయి 25,606.62 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 49.50 పాయింట్లు పడిపోయి 7,849.80 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు వారాల్లో సెనె్సక్స్ 1,164.30 పాయింట్లు, నిఫ్టీ 344.10 పాయింట్లు చొప్పున లాభపడినది తెలిసిందే. కాగా, ఏప్రిల్ నెలకు సంబంధించి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం, అమెరికా, జపాన్ రిజర్వ్ బ్యాంక్‌ల సమావేశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

వ్యాపార అనుకూల పరిస్థితులపై కెటిఆర్ కసరత్తు

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించడం ద్వారా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మంచి ర్యాంకు సాధించాలని టిఎస్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులకు సూచించారు. గతంలో ఈ అంశంలో ప్రపంచ బ్యాంకు మంచి ర్యాంకు ఇవ్వకపోవడంతో శాఖల వారీగా అధికారులతో శనివారం ఇక్కడ కెటిఆర్ సమీక్ష జరిపారు. మెరుగైన ర్యాంకు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఇంధనం, మున్సిపల్, న్యాయ, అటవీ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది.

నైట్ రైడర్స్‌కు షాక్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ 27 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. కరుణ్ నాయక్, బిల్లింగ్స్ అర్ధ శతకాలతో రాణించడంతో డేర్‌డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. అనంతరం నైట్ రైడర్స్‌ను 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ చేసింది. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న కార్లొస్ బ్రాత్‌వెయిట్ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. 11 బంతుల్లోనే 34 పరుగులు చేసిన అతను చక్కటి బౌలింగ్ ప్రతిభ కనబరచి, మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.

Pages