S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ.. మేళా

హైదరాబాద్, ఏప్రిల్ 30 : వ్యవసాయం, రవాణా, ఎక్సైజ్ శాఖల్లో 1477 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 పోస్టులు 1000, రవాణా శాఖలో 137 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులన్నింటికీ 2016 మే 4 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి ప్రకటించారు. ఎఇఓ పోస్టులకు మే 19 వరకు, రవాణా, ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు మే 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

మే 6 నుంచి నెహ్రూ మునిసిపల్ హైస్కూల్‌లో సమ్మర్ క్రికెట్ క్యాంప్

తిరుపతి, ఏప్రిల్ 30: స్థానిక నెహ్రూ మునిసిపల్ హైస్కూల్‌లో మే 6 నుంచి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ స్థాయి కోచ్ బి. విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు మే 5వ తేదీ లోపల పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. క్యాంపుకు వచ్చే క్రీడాకారులు వైట్ అండ్ వైట్ డ్రెస్ తీసుకురావాలని, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తికలిగిన క్రీడాకారులు ఎండి జిలానీ క్రికెట్ కోచ్‌ను సంప్రదించాలన్నారు.

గాయపడిన బాలికకు ఎలైట్ ఆసుప్రతిలో చికిత్స

తిరుపతి, ఏప్రిల్ 30: స్థానిక ఇసుకవీధిలో కొద్ది రోజుల క్రితం ఓ భవనం కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గిరిష్మాకు శనివారం స్థానిక ఎలైట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, డాక్టర్ మురహరి, డాక్టర్ బాబురావు బృందం ఆమెకు శస్తచ్రికిత్స చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గిరిష్మా వెనె్నముకకు బలమైన గాయమైందని అన్నారు. అమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

నదీ జలాలపై ప్రత్యేక కమిటీ

విశాఖపట్నం, ఏప్రిల్ 30: కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీ, వినియోగానికి కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల సిఎంలతో కూడిన అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నీరు- ప్రగతి కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అపెక్స్‌బాడీ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తుచేశారు. గతంలో మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు జరిగాయని, రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో చివరి రాష్ట్రానికి అన్యాయం జరక్కుండా దామాషా ప్రకారం నీటి పంపకాలు చేపట్టాలన్నారు.

పేట శ్రీనివాసులు రెడ్డికి కీర్తి పురస్కారం

తిరుపతి, ఏప్రిల్ 30: ఎస్వీయూనివర్శిటీ తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డికి హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకమైన కీర్తి పురస్కారం ప్రకటించింది. మే నెలలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పలు దినపత్రికల్లో పేటశ్రీ రచించిన తిరుపతి కథలకు ఆథ్యాత్మికం విభాగంలో ఈపురస్కారం లభించింది. ఆయన ఇప్పటి వరకు 16 అవార్డులు అందుకోవడం గమనార్హం.

విదేశాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక

తిరుపతి, ఏప్రిల్ 30: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు చేపడుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను విదేశాల్లో నిర్వహించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు టిటిడి సంయుక్త కార్యనిర్వాహణాధికారి పోలాభాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తన చాంబర్‌లో శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె ఇ ఓ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను విదేశాల్లో రెండు రోజుల పాటు వారాంతంలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. శుక్రవారం సాయంత్రం విగ్రహప్రతిష్ట, పుణ్యాహవచనం, వాస్తుహోమం చేపట్టాలని సూచించారు.

మునిసిపల్ చైర్‌పర్సన్‌పై దాడికి యత్నం

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 30: లోలోపల ఉండిన టిడిపి అసమ్మతి కౌన్సిలర్ల వివాదం శనివారం బహిరంగంగా మారింది. టిడిపికి చెందిన మునిసిపల్ చైర్‌పర్సన్‌పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు దాడికి ప్రయత్నించి సంచలనం రేపారు. మునిసిపల్ సర్వసభ్యసమావేశం శనివారం ఉదయం చైర్‌పర్సన్ పేట రాధారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అసమ్మతి కౌన్సిలర్లు శరవణ, బషీరు, గురు నాగరాజ తదితరులు మునిసిపల్ చైర్‌పర్సన్ వైఖరిపై దాడికి దిగారు. గత నెలలో జరిగిన బడ్జెట్ సమావేశం సందర్భంగా అసమ్మతి తెలియజేశామని, అయితే అసమ్మతిని తెలపకుండానే బడ్జెట్‌ను ఏ విధంగా ఆమోదిస్తారని ప్రశ్నించారు.

కుటుంబంలో ప్రతిఒక్కరు ఆదాయం పెంచుకోవాలి

తిరుపతి, ఏప్రిల్ 30: ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆదాయం సమకూర్చుకునే విధంగా మెప్మా సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర సెర్ప సి ఇ ఓ స్మాలన్ ఆరోఖ్య రాజ్ అన్నారు. శనివారం స్థానిక ప్రైవేట్ హోటల్లో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మెప్మా అధికారులతో వివిధ మున్సిపాలిటీల్లో జీవనోపాదుల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్.హెచ్.జి., ఎస్ ఎల్. ఎఫ్., టి ఎల్ ఎఫ్ స్థాయిలో పొదుపులు, అప్పుల వసుళ్ళు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రుణాలు పొందిన సంఘ సభ్యురాలు రుణమొత్తాన్ని జీవనోపాధి యూనిట్‌ను పెట్టుకునే విధంగా మీరందరూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు.

సమాజాన్ని ముందుకు నడిపే కథలు రావాలి

తిరుపతి, ఏప్రిల్ 30: సమాజాన్ని ముందుకు నడిపించే కథలు రావాలని అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ యువ రచయితలకు పిలుపునిచ్చారు. స్థానిక వరదరాజనగర్‌లోని జె.సి.ఆర్. చైతన్య పాఠశాల్లో యువ కథారచయితలకు కథలబడి కార్యశాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 40మంది యువ కథ రచయితలకు రెండురోజులపాటు కథాసాహిత్యంపై శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కథానిక-శిల్పం గురించి పాపినేని శివశంకర్, కథారచన-వాస్తవికత-కాల్పనికత అనే అంశంపై అట్టాడ అప్పలనాయుడు, తెలుగు కథ-జనజీవితం గురంచి డి.రామచంద్రరాజు వివరించారు.

ఘనంగా అన్నమయ్య హరికొలువు సిడి ఆవిష్కరణ

తిరుపతి, ఏప్రిల్ 30: శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక అన్నమాచార్య కళామందిరంలో శనివారం సాయంత్రం అన్నమయ్య హరికొలువు సిడి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి, ప్రత్యేక శ్రేణి డిప్యూటి ఇ ఒ మునిరత్నం రెడ్డి ఈ సిడిలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 1932 సంకీర్తనలను రికార్డు చేశామని, మరో 170 కీర్తనలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈనెలలో అన్నమయ్య జయంతి సందర్భంగా 10 సిడిలు ఆవిష్కరించేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు.

Pages