S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాల ఉమ్మడి దురాక్రమణ పొంచి ఉన్న నేపథ్యంలో మన రక్షణ వ్యయం గణనీయంగా పెరగవలసి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల ఐదవ తేదీన పార్లమెంటుకు సమర్పించిన నూతన వర్ష ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్లో ఈ పెరుగుదల తగినంతగా కనిపించకపోవడం విచిత్రమైన వ్యవహారం.
జీవన సౌలభ్యం-ఈజ్ ఆఫ్ లివింగ్-గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం హర్షణీయం. జూలై ఐదవ తేదీన పార్లమెంటుకు సమర్పించిన నూతన వార్షిక ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-లో జీవన సౌలభ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ నుంచి భారతీయ జీవనం క్రమంగా విముక్తం కాగలదన్న ఆశలు అంకురించడానికి ప్రాతిపదిక! అంకురించిన ఆశలు చిగురిస్తాయా?- అన్నది వేచి చూడదగిన పరిణామం.
విశ్వాసం వికసిస్తుండడం మరోసారి ఆవిష్కృతమైన దృశ్యం. ‘జాతీయ వికాస ప్రక్రియ’ వేగవంతం అవుతోందన్న విశ్వాసం వికసిస్తోంది. ఇలా వికాసం-ప్రగతి-పట్ల విశ్వాసం వికసించడం- పెంపొందుతుండడం జాతీయ ఇతివృత్తం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన ‘వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-లోని ప్రధాన అంశం ఈ జాతీయ ఇతివృత్తం.
మన దేశంలో తిష్ఠవేసిన సమయంలో ఘోర నేరాలు చేసిన విదేశీయులు తప్పించుకొని స్వదేశాలకు వెళ్లగలుగుతున్నారు. కొందరు మన యంత్రాంగం కళ్లుగప్పి జారుకున్నారు, మరికొందరు మన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పారిపోగలిగారు. ఇంకొందరు బహిరంగంగా, దర్జాగా, ప్రభుత్వం వారి అనుమతితోను సహకారంతోను విమానాలనెక్కి ఉడాయించారు. కానీ నేరం చేయని మన దేశస్థులు నేరారోపణలకు గురై విదేశాల జైళ్లలో మగ్గుతున్నారు.
పరాజయానికి బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకునే సంప్రదాయం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచీ ఆ ‘కుటుంబ’ వారసత్వం కాదు. అందువల్ల ‘ భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించడం ఆశ్చర్యకరం. కానీ, ఇన్నాళ్లపాటు ఆయన అధ్యక్షుడుగా కొనసాగడం మరింత ఆశ్చర్యకరం. లోక్సభ ఎన్నికలలో తమ పార్టీ ఘోర పరాజయం పాలుకావడానికి బాధ్యత వహించి రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకుంటున్నాడు.
హాంగ్కాంగ్ ప్రాంతంలో ప్రస్తుతం చైనా ప్రభుత్వ వ్యతిరేక నిరసన జ్వాలలు చెలరేగుతుండడం, ‘కైలాస పర్వత మానస సరోవర’ ప్రాంతం చైనా అక్రమ అధీనంలో కొనసాగుతుండడం సమాంతర చరిత్రతో ముడివడిన విపరిణామ క్రమం. ఈ సమాన సమాంతర చరిత్ర బ్రిటన్ సామ్రాజ్యవాదుల దురాక్రమణ. చైనా ప్రధాన భూభాగాన్ని ఆనుకొని ఉన్న ‘హాంగ్కాంగ్’ను క్రీస్తుశకం 1842లో బ్రిటన్ కబళించింది.
వాణిజ్య జలాలు పల్లెలలోని ఇళ్లకు సైతం పరుగులు తీస్తుండడం సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘జలశక్తి అభియాన్’కు విచిత్రమైన నేపథ్యం. భారత జాతీయ అస్తిత్వాన్ని ‘ప్రపంచీకరణ ఆర్భాటం’ దిగమింగుతుండడం వాణిజ్యపు నీరు ఇంటింటికీ సరఫరా అవుతుండడానికి కారణం. స్వచ్ఛమైన నీరు బహుశా దేశంలో ఎక్కడ కూడ లేదు... స్వచ్ఛ జలాలు భారతీయ అస్తిత్వం! పాలకంటె నీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం ప్రాకృతిక సత్యం, సృష్టిగత వాస్తవం!
దేశంలోని రైతులకు అవసరవౌతున్న విత్తనాలలో డెబ్బయి శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుండడం తెలుగువారికి గర్వకారణం. ‘విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంతర్జాతీయ సంస్థ’- ఇంటర్నేషనల్ సీడ్ టెక్నాలజీ అసోసియేషన్- ఇస్టా- ముప్పయి రెండవ మహాసభల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వ్యవసాయ ప్రగతి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
ఇంగ్లండులో కాని అమెరికాలో కాని తయారయ్యే.. వస్తువుకుండే నైగనిగ్యం, లావణ్యం, సౌందర్యం, మన్నికా మన దేశంలో-తయారయ్యే వస్తువునకు- చచ్చినా రాదు. రాకపోయినా స్వదేశ వస్తువంటావేమో! ఆ భావం ఇదివరకే చచ్చిపోయింది. దానికి ఢిల్లీలో సమాధి కట్టారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని నీరు కాలుష్యగ్రస్తమైపోయిందన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా చెప్పిన మాట. కృష్ణానదిలో స్నానం చేసి విజయవాడలో కనకదుర్గమ్మను పూజించడానికి వస్తున్న భక్తులు ప్రకాశం ఆనకట్ట సమీపంలో స్నానయోగ్యం కాని జలాలను, పరిసరాలను దర్శిస్తుండడం ముఖ్యమంత్రి చెప్పని మాట..