-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఆగస్టు 10: పొరుగూళ్లో పరువుగా ఉండండి. భారత గౌరవం ఇనుమడించేలా బాధ్యతతో మెలగండి’ అంటూ ఆసియా గేమ్స్ బృందానికి సాదర సూచనలు చేశారు కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాధోడ్. ఇండోనేసియాలోని జకర్తా, పాలెంబాగ్లో ఆగస్టు 18నుంచి మొదలవుతున్న ఆసియా గేమ్స్లో పాల్గొంటున్న భారత బృందానికి భారత ఒలింపిక్ సమాఖ్య శనివారం ఢిల్లీనుంచి సాదర వీడ్కోలు ఏర్పాటు చేసింది.
మెహిద్దీన్ మెఖస్సీ. ఐదో యూరోపియన్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన క్షణంలో ఇలా.. ఐరోపా ఖండం మొత్తంమీద స్టీప్లీచెస్లో తననుకొట్టేవాడే లేడన్న ఆనందమిది. ఫ్రాన్స్కు చెందిన 33ఏళ్ల ఈ అథ్లెట్ 3వేల మీటర్ల స్టీప్లీచెస్ రేస్ను 8 నిమిషాల 33.66 సెకండ్లలో పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
హో చి మిన్, ఆగస్టు 10: భారత షట్లర్లు అజయ్ జయరాం, మిధున్ మంజునాథ్ శనివారం మరో మెట్టెక్కారు. వియత్నాం ఓపెన్ బాడ్మింటన్ సూపర్ టూర్ 100 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్కు చేరారు. శనివారం హోరాహోరీ పోరులో ప్రత్యర్థి, కెనడా ఆటగాడు షెంగ్ గ్జియోడాంగ్ను 26-24, 21-17 సెట్లతో జయరాం ఓడించాడు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆమోదించిన కొత్త నిబంధనావళికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందంచడం హర్షణీయమని బోర్డు పాలనా వ్యవహారాల బృందం (సీఓఏ) వ్యాఖ్యానించింది. దేశంలో క్రికెట్ ప్రక్షాళనకు లోధా కమిటీ చేసిన సూచనలను అమలు చేసేందుకు ఇప్పుడు మార్గం సుగమమైందని పేర్కొంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ రేసులో మాజీ స్పిన్నర్లు సునీల్ జోషి, రమేష్ పోవార్ ముందున్నారు. కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ శుక్రవారం నిర్వహించే ఇంటర్వ్యూలో హాజరుకానున్న 20 మందిలో వీరిద్దరు కూడా ఉన్నారు. భారత మాజీ వికెట్ కీపర్లు అజయ్ రత్రా, విజయ్ యాదవ్, మాజీ మహిళా క్రికెటర్లు మమతా మబెన్, సుమన్ శర్మ ఇంటర్వ్యూలో చేస్తారు.
లండన్, ఆగస్టు 9: లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్-్భరత్ మధ్య గురువారం జరుగనున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. బుధవారం రాత్రి నుంచే లండన్లో జోరుగా వర్షం కురుస్తుండడంతో ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం కనీసం సాధన (వార్మప్) చేయలేకపోయారు. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు గాలులు వీయకపోవడంతో వాతావరణం చల్లగా ఉంది. అయితే, వాతావరణంలో మార్పు రాకపోతుందా అని నిర్వాహకులు యోచిస్తున్నా ఫలితం లేకపోయింది.
బంగ్లాదేశ్, ఆగస్టు 9: చేతి వేలికి తగిన గాయంతో చాలాకాలంగా బాధపడుతున్న బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షాకీబ్ అల్ హసన్ సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే ఆసియా కప్ టోర్నమెంట్లో ఆడే అవకాశం లేనట్టే. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన ఒక వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్లో షాకీబ్ ఎడమచేతి చిటికిన వేలికి గాయమైంది.
కొలంబో, ఆగస్టు 9: ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడన్న అభియోగంపై నిషేధం ఎదుర్కొని రెండు టెస్టు సిరీస్లకు దూరమైన 28 ఏళ్ల శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 మ్యాచ్ ఆడే 15 మంది శ్రీలంక సభ్యుల బృందంలో చండీమల్ మళ్లీ చోటు దక్కించుకున్నాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ వాల్యూ అమాంతం 19 శాతం పెరిగింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్తో ముంబయి ఇండియన్ (ఎంఐ) 113.0 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానంలో నిలబడింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరగడంలో ముంబయి ఇండియన్స్ వరుసగా అగ్రస్థానానికి చేరడం వరుసగా ఇది మూడోసారి. మూడుసార్లు ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ గెలవడంతో ఆ జట్టు బ్రాండ్ విలువ 19 శాతం పెరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి ఊరట లభించింది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలు చేయడానికి వీలుగా నిబంధనావళిని మార్చాలన్న ఆదేశాలను ఒకవైపు శిరసావహిస్తూనే, మరోవైపు గతంలో తాను చేసిన వాదనను నెగ్గించుకుంది. సవరణలతో కూడిన తీర్మానాలను ఆమోదించిన తర్వాత సమర్పించిన సరికొత్త నిబంధనావళిని సుప్రీం కోర్టు ఆమోదించింది.