-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
జకార్తా, ఆగస్టు 18: ఆసియా గేమ్స్లో తమ గన్స్ గురితప్పే అవకాశమే లేదన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు కుర్ర ప్రతిభావంతులు అనీష్ భన్వాలా, మను భాస్కర్, ఎల్వెనీల్ వలరివన్లు. ఆసియా గేమ్స్లో నేటినుంచి మొదలవుతున్న షూటింగ్ ఈవెంట్ ఆరంభంలోనే చైనా, సౌత్ కొరియా షూటర్లను ఎదుర్కోడానికి సంసిద్ధులవుతున్నారు.
జకార్తా, ఆగస్టు 18: 18వ ఆసియా గేమ్స్లో భారత షట్లర్ల పతకాల వేట ఆసక్తికరంగానే సాగనుంది. నేటినుంచి టీం కాంపిటీషన్ మొదలవుతున్న నేపథ్యంలో భారత జట్లు మానసికంగా సిద్ధమవుతున్నారు. 1986లో ప్రకాష్ పడుకొనె, విమల్కుమార్ల ద్వయం సాధించిన రజతం తరువాత, పతకాల కరవుతో అల్లాడుతున్న భారత్కు సైనా నెహ్వాల్, సింధు ద్వయం ఊరటనిచ్చింది. 2014 ఆసియా గేమ్స్లో రజతాన్ని సాధించి భారత దాహార్తిని చల్లార్చారు.
జకర్తా: భారత అథ్లెట్లు పోరాట పటిమను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. అనుభవం గడించిన సూపర్స్టార్లు ఖ్యాతిని నిలుపుకునే రోజు వచ్చింది. కామనె్వల్త్ గేమ్స్ తరువాత భారత అథ్లెట్లు తన సత్తా చాటే వేదిక సిద్ధమైంది. ఇండోనేసియా ఆతిథ్యంలో 18వ ఆసియా గేమ్స్ శనివారం నుంచి జకర్తా, పాలెంబాగ్లో అట్టహాసంగా మొదలవుతున్నాయి.
నాటింగ్హామ్, ఆగస్టు 17: ట్రెంట్ బ్రిడ్జి. ఇంగ్లాండ్తో ‘్థర్డ్ వార్’కు వేదిక. ఎడ్జ్బాస్టన్లో 31 పరుగులతో కిందపడి, లార్డ్స్లో ఇన్నింగ్స్, 159 పరుగులతో సిరీస్మీదకు తెచ్చుకున్న భారత్ది -నిప్పులు రాల్చాలో, నిష్క్రమించాలో తేల్చుకోవాల్సిన స్థితి. ‘కాఫీ’ కబుర్లతో అడుగుపెట్టిన తమతో కషాయం తాగించిన ఇంగ్లీష్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి.
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ను సమర్థుడైన ఆటగాడని, తిరుగులేని నాయకుడని, యువ ఆటగాళ్లను ఉన్నత శిఖరాలకు నడిపించిన మార్గదర్శి అని పలువురు ప్రశంసించారు. వాడేకర్ మృతి చెందారన్న వార్త తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ కెప్టెన్లు మహమ్మద్ అజరుద్దీన్, అనిల్ కుంబ్లే, సచిన్ తెండూల్కర్ తదితరులు వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్ స్పష్టం చేసింది. గురువారం ఆమె పీటీఐతో మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని అన్నది. అయితే, పోటీని సమర్థంగా ఎదుర్కొని, పతకాలను కైవసం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నది.
నాటింగ్హామ్, ఆగస్టు 16: ఆతిధ్య ఇంగ్లాండ్తో శనివారం నుంచి బర్మింగ్హామ్లో ప్రారంభమయ్యే మూడో టెస్టు మ్యాచ్లో తలపడే టీమిండియా గతంలో జరిగిన లోపాలను సరిద్దుకుని చివరి వరకూ పోరాడాలని జట్టు కోచ్ రవి శాస్ర్తీ పిలుపునిచ్చాడు. ఇప్పటికే ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 0-2తో భారత్ వెనుకబడడంతోపాటు అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జట్టు మళ్లీ పుంజుకునేందుకు తీవ్రంగా స్పందించాడు.
జకార్తా, ఆగస్టు 16: ఈనెల 18వ తేదీ నుంచి ఇండోనేషియాలోని జకార్తాలో భారీ ఎత్తున నిర్వహించే ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకుంటున్నారు.
లండన్: మూడో టెస్ట్కు ముందే భారత్ వైట్వాష్ గురించి మాట్లాడుకోవడం తొందరపాటే అవుతుందని ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ టూర్లో భాగంగా ఇప్పటికి రెండు టెస్ట్లు ఆడిన భారత్ 0-2 స్కోరుతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఎడ్జ్బాస్టన్ తొలి టెస్ట్లో 31 పరుగులతో ఓటమి చవిచూసిన భారత్, లార్డ్స్ రెండో టెస్ట్లో సిరీస్, 151 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూడటం తెలిసిందే.
లండన్, ఆగస్టు 15: పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదంటారు పెద్దలు. వాళ్ల మాట నిజమవ్వాలంటే ట్రెంట్ బ్రిడ్జిలో టీమిండియా చేతనైన ఆటాడాలి. థర్డ్ టెస్ట్లో గౌరవప్రదమైన గెలుపు సాధించాలి. అందుకు కోహ్లీసేన సమాయత్తమైందా? అసలు సారథి కోహ్లీయే ఫిట్నెస్ను సాధిస్తాడా? రాణించే ఓపెనర్లు రంగంలోకి దిగుతారా? ప్రతికూల వాతావరణాన్ని భారత్ ఎదుర్కోగలుగుతుందా?