S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/12/2017 - 09:48

రాంచీ, మార్చి 11: స్పిన్‌కు అనుకూలిస్తున్న భారత పిచ్‌లపై భారీ షాట్లకు ప్రయత్నించి, తక్కువ స్కోర్లకే అవుటవుతున్నప్పటికీ, వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా ఓపెన్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత టూర్‌లో అతను టెస్టుల్లో మూడు పర్యాయాలు అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన అతను ఉమేష్ యాదవ్ చేతిలో అవుటయ్యాడు.

03/12/2017 - 09:47

హైదరాబాద్, మార్చి 11: ప్రతిభను ప్రోత్సహించి, అత్యుత్తమ క్రీడాకాలను అందించేందుకే అకాడమీని ఏర్పాటు చేసినట్టు భారత బాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తెలిపింది. శనివారం హైదరాబాద్‌లో గ్లోబల్ అకాడమీని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి అకాడెమీలో శిక్షణ మొదలవుతుందని తెలిపింది. దేశంలో బాడ్మింటన్‌కు ఎంతో ఆదరణ ఉందని, ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని పేర్కొంది.

03/12/2017 - 09:47

న్యూఢిల్లీ, మార్చి 11: జయాపజయాలు ఆటలో భాగమని, ఓటమికి కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తానని భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు స్పష్టం చేసింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మొదటిసారి క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు తన ప్రత్యర్థి తాయ్ జూ ఇంగ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ కూడా క్వార్టర్స్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొంది.

03/11/2017 - 01:02

న్యూఢిల్లీ, మార్చి 10: డిఆర్‌ఎస్ వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. పరిస్థితి విషమించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్‌తో బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీ సమావేశమై చర్చించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.

03/11/2017 - 01:01

న్యూఢిల్లీ, మార్చి 10: బెంగళూరులో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న జాతీయ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం ప్రకటించిన 33 మంది ప్రాబబుల్స్ జాబితాలో సీనియర్ ఆటగాడు విఆర్ రఘునాథ్ పేరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అతని పేరు పొరపాటున గల్లంతైందా లేక హెచ్‌ఐ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తొలగించారా అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించడం లేదు.

03/11/2017 - 00:59

వెస్టిండీస్‌తో బార్బడాస్‌లో జరిగిన చివరి, మూడో వనే్డను 186 పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు. చివరి మ్యాచ్‌లో ఈ జట్టు 50 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విండీస్ 142 పరుగులకే కుప్పకూలింది

03/11/2017 - 00:58

మెల్బోర్న్, మార్చి 10: టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో మెరుగ్గానే ఉన్నప్పటికీ, టి-20 ఫార్మాట్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడాన్ని గమనించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రత్యేక సెలక్షన్ కమిటీని నియమించింది. టి-20 ఫార్మాట్‌కు మాజీ క్రికెటర్ మార్క్‌వాను సెలక్షన్ కమిటీలోకి తీసుకుంది. టెస్టు, వనే్డ ఫార్మాట్స్‌లో చీఫ్ సెలక్టర్‌గా ట్రెవర్ హార్న్స్ తన బాధ్యతలను కొనసాగించనున్నాడు.

03/11/2017 - 00:57

న్యూఢిల్లీ, మార్చి 10: కోహ్లీ, స్మిత్ డిఆర్‌ఎస్ వివాదానికి తెరపడినట్టేనని బిసిసిఐ పాలక కమిటీ (సిఒఎ) సభ్యురాలు, భారత మహిళా క్రికెటర్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అన్నది. శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, డిఆర్‌ఎస్ వివాదాన్ని పరిష్కరించడంలో బిసిసిఐ అద్భుత పాత్ర పోషించిందని ప్రశంసించింది.

03/11/2017 - 00:55

బర్మింగ్‌హామ్, మార్చి 10: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టో ర్నమెంట్‌లో తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సిం ధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్‌తో తలపడిన ఆమె 14-21, 10-21 తేడాతో ఓటమిపాలైంది. ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న సింధు తన కంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్న జూ ఇంగ్‌కు గట్టిపో టీనే ఇచ్చింది.

03/11/2017 - 00:53

గాలే, మార్చి 10: శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్నది. మొదటి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్‌లో ఉపుల్ తరంగ శతకంతో రాణించగా, ఆరు వికెట్లకు 274 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది.

Pages