-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
బ్యాంకాక్, డిసెంబర్ 2: మహిళల ఆసియా కప్ టి-20 టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ను ఢీకొన్న నేపాల్ చిత్తుచిత్తుగా ఓడింది. మహిళల క్రికెట్ టి-20 ఫార్మెట్లో అత్యల్ప స్కోరును నమోదు చేసి పరువు పోగొట్టుకుంది. 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆ జట్టు 16.3 ఓవర్లు ఆడి, కేవలం 21 పరుగులకే కుప్పకూలింది.
పార్లమెంటు భవనానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. మొన్న ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పార్లమెంటు హౌస్కు వెళ్లి, తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాడు. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా ప్రధానికి పెళ్లి పత్రిక అందించేందుకు వచ్చాడు. బాస్కెట్బాల్ క్రీడాకారిణి ప్రతిమతో అతని వివాహం ఈనెల 9న జరగనుంది.
సిడ్నీ, డిసెంబర్ 2: కొలంబియా విమాన ప్రమాదంలో మృతి చెందిన బ్రెజిల్ సాకర్ క్రీడాకారుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీలుగా అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తన ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. సోమవారం ఉదయం జరిగే మహిళల అండర్-20 ప్రపంచ కప్ సాకర్ చాంపియన్షిప్ ఫైనల్ను తిలకించేందుకు అతను రావాల్సి ఉండింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి బ్యాట్స్మన్లలో ఒకరైన సనత్ జయసూర్య టీమిండియా కెప్టెన్ వారాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీ ఒక గొప్ప క్రికెటర్గా ఎదిగిన తీరును, ఆట పట్ల అతని అంకిత భావాన్ని జయసూర్య ప్రశంసించాడు. ‘విరాట్ కోహ్లీ అంకితభావం కలిగిన క్రికెటర్. ప్రతి మ్యాచ్కి మందు అతను ఎంతో శ్రమించి ప్రాక్టీస్ చేయడమే కాక శిక్షణ పొందుతాడు.
న్యూయార్క్, డిసెంబర్ 1: చదరంగ ప్రపంచంలో నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైబ్రేకర్లో బుధవారం అతను రష్యాకు చెందిన సెర్గీ కర్యాకిన్ను ఓడించి వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచాడు.
మకావూ, డిసెంబర్ 1: మకావూ ఓపెన్ గ్రాండ్ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్తో పాటు యువ ఆటగాడు బి.సాయ ప్రణీత్ మరో అడుగు ముందుకేశారు.
కరాచీ, డిసెంబర్ 1: టీమిండియాతో ఆడేందుకు తామేమీ ‘ప్రాధేయపడటం’ లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. అయితే ఇరు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయును) గౌరవించాల్సిందిగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)పై వత్తిడి తీసుకొచ్చేందుకు తమకు అన్ని హక్కులూ ఉన్నాయని ఆయన చెప్పాడు.
బ్యాంకాక్, డిసెంబర్ 1: ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తున్న భారత జట్టు మరో అడుగు ముందుకు వేసింది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ 52 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో ఓపెనర్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 62 పరుగులు), బౌలింగ్లో ఏక్తా బిస్త్ (3/8), ప్రీతీ బోస్ (3/14) చక్కగా రాణించి భారత జట్టును విజయపథంలో నడిపారు.
పారిస్, డిసెంబర్ 1: పారిస్లో జరుగుతున్న మహిళల స్క్వాష్ ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభాన్ని సాధించింది. ఈ టోర్నీలో 9 నుంచి 12వ స్థానం కోసం ఆడుతున్న భారత జట్టు గురువారం ఇక్కడ జరిగిన ఓపెనింగ్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో 3-0 తేడాతో నెదర్లాండ్స్ను మట్టికరిపించింది.
సిడ్నీ, డిసెంబర్ 1: పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ పాక్ యువ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ, 22 ఏళ్ల ఆజమ్ ఆ వయసులో కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడన్నాడు. పాకిస్తాన్ యువ బ్యాట్స్మన్ ఆజమ్ ఇప్పటిదాకా మూడు టెస్టులు ఆడగా, గత వారం హామిల్టన్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో సెంచరీ చేసే సదవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు.