S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/28/2016 - 07:33

సికింద్రాబాద్, నవంబర్ 27: వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేపట్టిన ధర్మ యుద్ధానికి కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

11/28/2016 - 07:30

పటియాలా, నవంబర్ 27: పంజాబ్‌లో ఆదివారం సాయుధ దుండగులు హై-సెక్యూరిటీ జైలుపై దాడికి పాల్పడి సంచలనం సృష్టించారు. పోలీసు దుస్తుల్లో వచ్చిన వీరు పటియాలా సమీపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన నభా జైలును బద్దలు కొట్టి పది కేసుల్లో నిందితుడిగా ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కెఎల్‌ఎఫ్) అధినేత హర్మీందర్ మింటూ సహా ఐదుగురు ఖైదీలతో అక్కడి నుంచి పరారయ్యారు.

11/28/2016 - 07:28

హైదరాబాద్, నవంబర్ 27: మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు ఇక్కడే (తెలంగాణలో) ఉండిపోవాలని ఉంది అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మనసు ఇక్కడేవున్నా, అక్కడ (ఏపీలో) బాధ్యతలు ఉన్నాయన్నారు. ఆదివారం తెలంగాణ తెదేపా సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు సుమారు 10 నెలల తర్వాత ఎన్టీఆర్ భవన్‌లో అడుగుపెట్టారు.

11/28/2016 - 07:26

మచిలీపట్నం, నవంబర్ 27: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద సమీపంలోని సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన 15మంది యువకులు ఆదివారం విహారయాత్రగా నాగాయలంక లైట్‌హౌస్‌కు వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో సరదాగా గడిపిన వారంతా మధ్యాహ్నం 4గంటల సమయంలో సముద్ర స్నానాలకు వెళ్ళారు.

11/28/2016 - 07:24

ముంబయి, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు వౌనాన్ని వీడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రోజు వారీగా సమీక్షిస్తూ, ప్రజల వాస్తవిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

11/28/2016 - 07:22

కాకినాడ, నవంబర్ 27: వంట గ్యాస్ సిలెండర్లను ఇక నుండి నగదు రహిత బదిలీ ప్రక్రియ ద్వారానే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తూర్పు గోదావరి జిల్లాలో చకచగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలెండర్లు సరఫరా చేసే ఎల్‌పిజి డీలర్లు విధిగా నగదు రహిత బదిలీని పాటించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

11/28/2016 - 07:10

హైదరాబాద్, నవంబర్ 27: నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత, సహకారం, సమన్వయం ఉన్నప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆదివారం టిటిడిపి సర్వసభ్య సమావేశం టిడిపి కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో జరిగింది.

11/28/2016 - 07:09

తిరుపతి, నవంబర్ 27: లోక రక్షణి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం అమ్మవారు పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుడు శ్రీలక్ష్మీనారాయణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

11/28/2016 - 07:08

హైదరాబాద్, నవంబర్ 27: పెద్దనోట్ల రద్దుతో తీవ్రవాదం, ఉగ్రవాదం ఉనికి కోల్పోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం నల్లకుబేరులకు శరాఘాతంగా మారిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డిజిపిల సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి హన్సరాజ్ ఆదివారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.

11/28/2016 - 07:08

హైదరాబాద్, నవంబర్ 27: పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న రద్దయిన కరెన్సీని జన్‌ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున డిపాజిట్ చేస్తున్నట్లు ఆదాయం పన్ను శాఖకు సమాచారం లభించింది. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్, యుపి, కేరళ, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో జన్‌ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున రద్దయిన కరెన్సీ డిపాజిటయింది.

Pages