-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, ఏప్రిల్ 4: చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వినూత్న పథకానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వేస్ట్ వెల్త్ బిన్లే ఆదాయ మార్గాలుగా మారనున్నాయి. ఈ బిన్లో ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ టీ కప్పులు, కూల్ డ్రింక్ల సీసాలు వంటివి వేయగానే అందులో నుంచి ఒక కూపన్ వస్తుంది.
హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్రంలో నిఘా వ్యవస్ధను పటిష్టం చేసేందుకు హోంశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. ఆరు చోట్ల కొత్తగా ప్రాంతీయ నిఘా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్, రాచకొండ, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్ పోలీసు కమిషనరేట్లలో ఆరు ప్రాంతీయ నిఘా విభాగాలను ఏర్పాటు చేస్తారు.
విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రంలోని ఆలయాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం విధించారు. ప్రసాదాల కవర్లపై దేవుడి చిత్రాల ముద్రణను నిషేధిస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్వి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదం కోసం వినియోగించే ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపరు కవర్లను వినియోగించాలని ఆదేశించారు.
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 4: ఒక దళితుడిని, అమాయకుడిని అన్యాయంగా కేసులో ఇరికించి శిక్షకు గురిచేశారని, ఆ కుటుంబాన్ని ఆదుకోడానికి ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్ర ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన పిడతల సత్యంబాబు మంగళవారం రాష్ట్ర అతిధి గృహంలో కారెం శివాజీకి వినతిపత్రం అందజేశారు.
అమరావతి, ఏప్రిల్ 4: ఫిరాయింపుపై మాట్లాడే నైతిక అర్హత వైసిపి అధినేత జగన్కు లేదని సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తన తండ్రి ఏ పార్టీలో చేరి ఏ పార్టీలో మంత్రి అయ్యారో ఓసారి తెలుసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కాల్వ వైసిపి అధ్యక్షుడికి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అమరావతి, ఏప్రిల్ 4: ‘నేను మంత్రిని కాకముందే నాకున్న పరిచయాలతో రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నించా. కానీ అప్పుడు వైఎస్సార్సీపీ వాటిని అడ్డుకుంది. ఇప్పుడు మంత్రిగా అధికారికంగానే నాకున్న పరిచయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తా’నని గ్రామీణాభివృద్ధి, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అవినీతి చేసే వాళ్లు భయపడాలి. నా మీద 420 కేసులు లేవని పరోక్షంగా జగన్నుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఒంటిమిట్ట, ఏప్రిల్ 3: కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంగళవారం వ్యాసాభిషేకం, అంకుర్ఫారణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం ధ్వజారోహణం, నవమి వేడుకలు, పోతన జయంతి నిర్వహిస్తారు. రాత్రి స్వామివారికి శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఉత్సవాల నేపధ్యంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు.
అమరావతి, ఏప్రిల్ 3: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, శాఖల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయం, అవమానంపై కమ్మ సామాజికవర్గం ఆగ్రహంతో రగిలిపోతుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోకుండా, తిరిగి శాఖల కేటాయింపులోనూ తమ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు అప్రాధాన్యమైన శాఖలు ఇవ్వడంపై కమ్మ సామాజికవర్గం అసంతృప్తితో ఉంది.
విజయవాడ, ఏప్రిల్ 3: రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే అత్యంత కీలక శాఖల్లో ఎక్సైజ్శాఖ ఒకటి. ఈ శాఖ ద్వారానే సాలీనా రూ.15వేల కోట్ల వరకు రాబడి లభిస్తున్నది. అదేమి దురదృష్టమో కాని ఈ శాఖ చేపట్టినవారు కారణాలేమైనా అప్రతిష్ట పాలవుతున్నారు. పలువురు ఆ శాఖ వల్ల శాశ్వతంగా మంత్రి పదవులనే కాదు శాసనసభకే దూరమవుతున్నారు. తాజాగా కొల్లు రవీంద్ర ఆ శాఖను కోల్పోయినప్పటికీ మంత్రి పదవిని మాత్రం కాపాడుకోగలిగారు.
విజయవాడ, ఏప్రిల్ 3: అపరిష్కృత డిమాండ్ల సాధనకై దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యజమానులు చేపట్టిన నిరవధిక బంద్ సోమవారం ఐదో రోజుకు చేరింది. డిమాండ్లలో ప్రధానమైన థర్డ్పార్టీ బీమా ప్రీమియంపై బీమా క్రమబద్ధీకరణ అభివృద్ధి సంస్థ ‘ఐఆర్డిఎ’ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రీమియం రేటుని ఒకేసారి 50 శాతం పెంచడాన్ని లారీ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.