-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: నిన్నటి వరకు చలిగాలుల తీవ్రతతో గజగజలాడిన విశాఖ ఏజెన్సీవాసులు ఇప్పుడు కాస్త కుదుటపడ్డారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జన జీవనం సాధారణ స్థాయికి చేరుకుంటోంది. శనివారం ఉదయం పాడేరులో 13, చింతపల్లిలో 14, లంబసింగిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నెల్లూరు: కోవూరు శివారు నందలకుంట వద్ద విజయవాడ నుంచి రేణిగుంటకు వెళ్తున్న వైట్ పెట్రోల్ ట్యాంకర్ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్ను క్యాన్లలో, బక్కెట్లలో తీసుకుపోయేందుకు సమీప గ్రామాల వారు భారీఎత్తున వచ్చారు.
కర్నూలు: కర్నూలు నగరంలో ఒకే రోజు రెండు చోట్ల చైన్ స్నాచింగ్లు జరగడంతో స్థానిక మహిళలు హడలెత్తిపోతున్నారు. శనివారం ఉదయం సాయినగర్లో ఓ వృద్ధురాలి మెడ నుంచి నాలుగు తులాల గొలుసును, అరోరా నగర్లో రత్నావతి అనే మహిళ మెడ నుంచి రెండు తులాల గొలుసును ఆగంతకులు తెంపుకొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తిరుమల: ఇక్కడి సమీపంలోని కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల వద్ద శనివారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పది లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించి దొంగలు పరారయ్యారు. సంఘటన స్థలంలో కొన్ని ఆయుధాలు, రంపాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి: ఇక్కడి రంగంపేట అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున తమపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పులకు భయపడి కూలీలు పారిపోగా, పోలీసులు రెండు కోట్ల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం చెరువులోపల్లి అంగన్వాడీలో పనిచేస్తున్న మహిళా టీచర్, ఆమె భర్త, పిల్లలు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన శుక్రవారం జరిగింది. భర్త, ఏడేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలిసింది.
విజయవాడ: నగరంలోని విజయ్నగర్ కాలనీలోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. రెడ్డి రంగస్వామి ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో సామాన్లన్నీ చెల్లాచెదరయ్యాయి. భారీ శబ్దంతో చుట్టుపక్కలవారు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పేలుడుకు దారితీసిన కారణాలపై బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
విజయవాడ: ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టళ్లలో వార్డెన్లు భారీగా నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు నందిగామలోని పలు హాస్టళ్లలో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా రికార్డులను తనిఖీ చేశారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య కంటే రిజిస్టర్లలో ఎక్కువగా సంఖ్యను చూపుతున్నట్లు, భోజనాలకు, ఇతర సౌకర్యాలకు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు కనుగొన్నారు.
విశాఖపట్నం : సెంట్రల్ జైలులో శ్రీనివాసురెడ్డి అనే ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 26న యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారంనాడు చనిపోయాడు. ఖైదీ మృతిపై కారణాలు తెలియరాలేదు.
కాకినాడ :తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి ఆర్ఆర్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బండారులంకకు చెందిన వాసుకుమార్, సాయికుమార్, కళ్యాణ్ అక్కడికక్కడే మృతిచెందారు.