S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/08/2017 - 00:45

దహేజ్ (గుజరాత్), మార్చి 7: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, పాత పెద్ద నోట్ల రద్దు వల్ల జిడిపికి వచ్చిన ముప్పేమి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014కు ముందు ద్రవ్యోల్బణం అదుపులో లేదన్న ఆయన తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణం అంశాన్ని లేవనెత్తలేకపోయాయని గుర్తుచేశారు.

03/08/2017 - 00:42

విశాఖపట్నం, మార్చి 7: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా లక్ష్యాలు చేరుకోవడం కష్టతరంగా మారింది. నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా డిసిసి బ్యాంకులోనూ ఇదే పరిస్థితి. రైతులు బకాయిలు చెల్లిస్తేనే మళ్ళీ రుణ సదుపాయం పొందగలుగుతారు.

03/08/2017 - 00:41

న్యూఢిల్లీ, మార్చి 7: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత జిడిపి వృద్ధిరేటు 7 శాతానికిపైగా నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందని అమెరికాకు చెందిన రేటింగ్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ మంగళవారం వ్యాఖ్యానించింది. ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) అక్టోబర్-డిసెంబర్ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైందని ప్రకటించినది తెలిసిందే.

03/07/2017 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ తోపాటు ఎటిఎం సేవలపై మళ్లీ చార్జీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా 2012లో మినిమం బ్యాలెన్స్ పరిమితిని, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎటిఎం సేవలపై చార్జీలను ఎస్‌బిఐ ఎత్తివేసింది.

03/07/2017 - 00:49

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేర్‌కు 18.75 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చేందుకు తమ బోర్డు అంగీకరించిందని సోమవారం ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు ఈ డివిడెండ్‌ను అందించాలని కోల్ ఇండియా ఆడిట్ కమిటీ సిఫార్సు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

03/07/2017 - 00:49

విశాఖపట్నం, మార్చి 6: ఎటువంటి రసాయనాలు కలపని నాణ్యమైన జిసిసి కుంకుమకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంతవరకు ఎక్కడా అందుబాటులో లేని ఛాయ కలిగిన ఈ కుంకుమను తీసుకునేందుకు పుణ్యక్షేత్రాలు ముందుకొస్తున్నాయి. మహానంది, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి జిసిసికి భారీగా ఆర్డర్లు కూడా లభించాయి.

03/07/2017 - 00:47

ముంబయి, మార్చి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు మార్గం సుగమం కావడంతో మదుపరులు పెట్టుబడులతో కదం తొక్కారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ రెండేళ్ల గరిష్ఠాన్ని చేరగా, 215.74 పాయింట్లు పుంజుకుని 29,048.19 వద్ద ముగిసింది. 2015 మార్చి 5 తర్వాత ఈ స్థాయికి సెనె్సక్స్ చేరుకోవడం ఇదే ప్రథమం. నాడు 29,448.95 వద్ద సెనె్సక్స్ ఉంది.

03/07/2017 - 00:46

హైదరాబాద్, మార్చి 6: పరిశ్రమలకు కేటాయించిన భూములను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. సోమవారం తన చాంబర్‌లో జోనల్ మేనేజర్లు, ఐలా కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

03/07/2017 - 00:45

ముంబయి, మార్చి 6: బ్యాంకులకు మరోసారి భంగపాటు తప్పలేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు ప్రధాన స్థిరాస్తులను బ్యాంకర్లు సోమవారం వేలం వేశారు. అయతే ఎప్పట్లాగే ఈసారి కూడా వేలం విఫలమవగా, ఒక్కరంటే ఒక్కరూ కొనేందుకు ముందుకు రాలేదు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయ పడినది తెలిసిందే.

03/07/2017 - 00:43

సోమవారం ముంబయలో గెలాక్సీ ఎ7, ఎ5 మోడల్
స్మార్ట్ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న సామ్‌సంగ్ ప్రతినిధి.
ఎ7 ధర రూ. 33,490, ఎ5 ధర రూ. 28,990గా ఉంది

Pages