-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
అనంతపురం: అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమ లు తరలిపోతున్నాయ. కరవు జిల్లా.. నాలుగు పరిశ్రమలు వస్తే జనానికి ఉపాధి దొరుకుతుందనుకుంటే శ్రుతి మించుతున్న రాజకీయ జోక్యం దాన్ని కాస్తా దూరం చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డం పడుతున్నారు. వాటాలు, మామూళ్ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ, బెదిరింపులకు దిగుతున్నారు.
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నెలకుముందు పెట్టుబడు ల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పిఐ) గత మూడు వారాల్లో మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఈ నెల ట్రేడింగ్ జరిగిన పదమూడు రోజుల్లో 11,000 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను పట్టుకొచ్చారు.
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారంపై విచారణను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరింత లోతుగా జరుపుతోంది. మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) గ్రూప్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ తదితర అంశాలను దగ్గరగా గమనిస్తోంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో దభోల్, జిఎమ్ఆర్, ల్యాంకో తదితర తొమ్మిది పవర్ ప్లాంట్లు ఆదివారం విజయవంతంగా 7.62 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎమ్ఎమ్ఎస్సిఎమ్డి) రీగ్యాసిఫైడ్ లిక్విడ్ నాచురల్ గ్యాస్ (ఆర్-ఎల్ఎన్జి)ను గెలుచుకున్నాయి. ఈ గ్యాస్తో ఈ తొమ్మిది ప్లాంట్లు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 6.79 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేయనున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 19: తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ (టిఎస్పిడిసి)కు విద్యుత్ సరఫరా కోసం టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ (టిపిటిసిఎల్)తో నవ భారత్ వెంచర్స్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం బిఎస్ఇకి నవ భారత్ వెంచర్స్ తెలిపింది.
ముంబయి, మార్చి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభాల్లో ముగిశాయి. రెండు నెలల గరిష్ఠ స్థాయి వద్ద సూచీలు నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గడచిన వారం నిర్వహించిన ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. ప్రపంచ వృద్ధిరేటు అంచనాల కంటే దిగువన పయనిస్తుండటంతో వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్ళకూడదని భావించిన ఫెడ్ రిజర్వ్..
హైదరాబాద్, మార్చి 19: రుణాల ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు ఆ సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. అలాగే మీడియా ఈ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శించడం తగదని, దీనికది పరిష్కారం కాబోదన్నారు.
ఒంగోలు, మార్చి 19: రొయ్యల సాగు ప్రస్తుత వేసవి కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. వర్షాకాలంలో సాగుచేసిన రొయ్యల పంటను మూడు వంతుల రైతులు తీసేయగా, మిగతా రైతులు సైతం చెరువుల్లోని రొయ్యలను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటను సొమ్ము చేసుకున్న రైతులు.. వేసవికాలం సాగు వైపు మొగ్గుచూపారు.
అహ్మదాబాద్, మార్చి 19: ద్రవ్యోల్బణం ఆధారంగా పొదుపు వడ్డీరేట్లుండాలని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. శుక్రవారం చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో ‘సేవింగ్స్ రేటు 9 శాతంగా, ద్రవ్యోల్బణం రేటు 11 శాతంగా ఉంటే పొదుపుదారులకు మిగిలేది ఏమీ ఉండదు.
న్యూఢిల్లీ, మార్చి 19: సెక్యూరిటైజేషన్ ఒప్పందం ద్వారా హైదరాబాద్కు చెందిన ఎస్కెఎస్ మైక్రోఫైనాన్స్ 538.11 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఈ తరహా లావాదేవీ ఇది ఏడోది కావడం గమనార్హం. శనివారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఎస్కెఎస్ మైక్రోఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం ఈ ఏడు లావాదేవీల్లో 2,319.93 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది.