S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/09/2019 - 22:40

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు కార్పొరేట్ చదువుల పుణ్యమాని ఎనలేని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఉపాధ్యాయుల అత్యుత్సాహం, మరోవైపు పిల్లల తల్లిదండ్రుల అత్యాశ వెరశి వారు పెట్టే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యార్థులు నానా యాతనలు పడుతున్నారు. ర్యాంకుల పేరిట కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను రాచి రంపాన పెడుతుంటాయి.

08/07/2019 - 02:13

పిల్లిమెడలో గంట ఎవరు కట్టాలి..? అంటూ దశాబ్దాల తరబడి నా న్చుతూ వస్తున్న ఓ మొండి సమస్యకి ముగింపు పలుకుతూ ప్రధాని మోదీ చివరికి- ఆ గంట కట్టారు. అయితే ఇది ముగింపా? లేక మరో సమస్య పురుడు పోసుకోవడానికి ప్రారంభమా? అనేది కాలమే చెప్పాలి.

08/06/2019 - 01:54

జయతు జయతు కాశ్మీరం
జయోస్తు భారత గళ మణిహారం
ఇదే స్వతంత్ర భారతం.. ఘన స్వతంత్ర భారతం
మన స్వతంత్ర భారతం.. ‘నమో’ తెచ్చిన నవతరం
ఈనాడు మన కాశ్మీరం.. అయింది రశ్మిమంతం
ప్రజాన్నభుక్కులు పరాన్న భుక్కులు
బజారుపాలయ్యారు, బేజారవుతున్నారు
ఇన్నాళ్ళూ దోచుకున్న కాశ్మీరం
కలగా, అందని ఫలంగా మారింది
***
తరతరాల సంకెలలను తటాలున త్రెంచుకుంది-

08/04/2019 - 02:03

ఈ ఏడాది ఎండలను పరిశీలించినపుడు ప్రకృతి ఎంత విధ్వంసకారిగా మారుతుందో అందరికీ తెలిసొచ్చింది. దీనికి కారణం మనిషి చేస్తున్న చర్యలే. మనిషి సుఖవాంఛతో ప్రకృతికి విరుద్ధంగా పయనిస్తూ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అడవులను నరుకుతున్నాడు, చెట్ల సంఖ్యను తగి గస్తున్నాడు, గుట్టలను ధ్వంసం చేస్తున్నాడు, ఇసుకను తోడుకుంటున్నాడు. భూమిని కాంక్రీటు మయం చేస్తున్నాడు.

07/31/2019 - 04:28

‘జాతి చరిత్రలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవారు పిల్లలు. బాలల ఉనికి దేశానికి జీవనాడి’ అన్నారు మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. పిల్లల ప్రాధాన్యతను గొప్పగా గుర్తించినప్పటికీ మన దేశంలో బాలలకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదు. కారణం గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న విద్యావ్యవస్థ.

07/31/2019 - 04:26

గిట్టుబాటు ధరకోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ తోటల రైతులకు స్వల్ప ఊరట లభించింది. గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు నానబెట్టిన సమాన పంటకు సమాన ధర డిమాండ్‌ను నూతన ప్రభుత్వం గద్దెనెక్కిన మూడు వారాల్లోనే పరిష్కరించింది. అయితే చాలామంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న రీతిలో ఇది పామాయిల్ రైతుల అసలు సమస్యకు పూర్తిస్థాయి జవాబుకాదు.

07/30/2019 - 02:10

వచ్చే సంవత్సరం జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. ఇటీవలనే ఆ క్రీడల్లో విజేతలకు అందివ్వనున్న పతకాలను ప్రజల ముందు ప్రదర్శించారు. అక్కడ జరిగే క్రీడల్లో తెలుగమ్మాయి సింధు పతకం గెలుచుకోగలదన్న ఆశాభావం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి పెద్దసంఖ్యలో క్రీడాకారులు పాల్గొననున్నారు.

07/28/2019 - 03:47

తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మార్కెట్ అవసరాలకనుగుణంగా విద్యాబుద్ధులు విద్యార్థులకు అందించే దిశగా ఈ యూనివర్సిటీలు పనిచేయనున్నాయి. ఇందులో రిజర్వేషన్లను తావులేకుండా ‘ప్రతిభ’కే పట్టం కట్టబోతున్నారు. ప్రతి రంగం తేజోవంతంగా విలసిల్లాలంటే ‘ప్రతిభ’ను వెలికితీసి దాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత ఉన్న సందర్భమిది.

07/26/2019 - 22:25

జాతీయ నూతన విద్యావిధానంపై కస్తూరి రంగన్ కమిటీ చేసిన ప్రతిపాదనల్లో కీలకమైన వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. కమిటీ చేసిన సిఫార్సుల్లో ‘అన్నిరకాల కోర్సులు, వృత్తి విద్యతోపాటు ఒకేచోట వుండాలన్న’ది ఆచరణీయం, ఆమోదయోగ్యమైనది.

07/23/2019 - 02:52

ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాలు గతంలో తాము అంచనా వేసిన దానికంటే అత్యంత వేగంగా వేడెక్కుతున్నాయని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూగోళంలో మూడింట రెండు వంతులు సముద్రం ఆవరించి ఉంది. మిగిలిన ఒక వంతు భూ భాగం. ఈ భూ భాగం వేడిని భూగర్భ జలాలు కొంతమేరకు ఉపశమింప జేస్తుంటాయి.

Pages