S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/21/2019 - 02:14

గతమెంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంతరించిపోతున్నా తన స్వభావాన్ని వదులుకోలేకపోతోంది. ఇటీవల ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ముస్లిం యూనివర్సిటీలను ప్రారంభించాలని అన్నాడు. యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ‘పాకిస్తాన్ సృష్టికర్త’ మహ్మద్ అలీ జిన్నా చిత్రపటం ఇప్పటికీ ఉంది.

07/19/2019 - 22:07

‘విభజించి పాలించు’ అనే అమానవీయ సూత్రాన్ని భారతదేశానికి మాత్రమే కాదు- మొత్తం ప్రపంచానికే అందించిన ఘనత మన దేశ వర్ణ, కుల వ్యవస్థ స్థాపకులకే దక్కుతుంది. విభజించి పాలించటాన్ని బ్రిటీష్‌వారు ఈ దేశంలోని కుల వ్యవస్థను చూసి నేర్చుకున్నదే. బ్రిటీష్‌వారు కాని, ఏ ఇతర దేశీయులు కాని ఈ దేశానికొచ్చి పాలకులుగా మారడానికి కులవ్యవస్థ వల్ల ఏర్పడిన భారతీయుల అనైక్యత, అంతర్గత కుమ్ములాటలే కారణం.

07/19/2019 - 02:31

బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పో రాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. తెల్లదొరలపై యు ద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్ పాండే. బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు వౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రాల వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే. దేశానికి స్వేచ్ఛ, స్వతంత్రాలు కావాలని కలలుకన్న మహనీయుడు అతడు.

07/17/2019 - 05:08

వెనిజులా దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఆహారం కొరత తాండవిస్తోంది. ద్రవ్యోల్బణం 720 శాతం పెరిగింది. ముద్రించిన కరెన్సీకి, నిత్యావసరాలకు పొంతన లేనందున సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాటా 30,000 రూ.లకు (్భరత కరెన్సీలో), లీటరు పాలు 48,000 రూ.కు చేరడం ఆర్థిక సంక్షోభం పరాకాష్ఠను తెలియజేస్తున్నది.

07/14/2019 - 02:40

సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న కర్నాటకలో మళ్లీ తీవ్ర రాజకీయ సంక్షోభం రాజుకొంది. దీనికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్-జేడీఎస్, భాజపా నేతలు పరస్పరం నిందారోపణలకు దిగారు. కర్నాటకలో గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి సంక్షోభాలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది.

07/13/2019 - 01:49

అం తర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం న్యాయస్థానాల తీర్పులతో సాధ్యం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చర్చల ద్వారా ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ప్రయత్నిస్తే తప్ప బలవంతంగానైనా పరిష్కారం చూపడం ఎవరికీ సాధ్యం కాదు.

07/10/2019 - 21:58

‘‘గాంధీజీపై మోదీజీకి రోజురోజుకీ మోజు పెరిగిపోతోంది. రేప్పొద్దున గాంధీ టోపీలు కూడా పెట్టుకోమంటాడేమో?’’ అన్నాడు మార్నింగ్ వాక్‌లో ఓ పెద్దాయన. ‘‘గాంధీ టోపీలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఎండాకాలం అయితే చల్లగా- శీతాకాలం అయితే వెచ్చగా వుంటుంది-’’ అంటూ తన బట్టతలను తడుముకున్నాడు ఆయన స్నేహితుడైన రిటైర్డ్ గవర్నమెంటు ఆఫీసరు.

07/09/2019 - 22:17

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) క్రియాశీలక ప్రస్థానం ప్రా రంభమై ఈనెల 9వ తేదీ నాటికి 70 ఏళ్లు పూర్తవుతున్నాయి. ‘విద్యార్థి పరిషత్’ ఆలోచనాధార, సంఘటనాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేసిన స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్‌ను ఈరోజు స్మరించుకోవాల్సిన దినం. వారి ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి యువత కంకణబద్ధులై నడుం బిగించాల్సిన రోజు.

07/07/2019 - 02:39

పసుపు, ఎర్రజొన్నల పంటలకు మద్దతు ధర ఇవ్వాలంటూ నిజామాబాద్ రైతులు చేస్తున్న ఆందోళన సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్నారు. తమిళనాడు, ఒడిశా, కేరళ, మహారాష్టల్ల్రోనూ దీన్ని కొంత పండిస్తున్నారు. దేశీయ అవసరాలకు, ఎగుమతులకు 55 లక్షల బస్తాల పసుపు సరిపోతుందని అంచనా. కానీ ఇపుడు 70 లక్షల బస్తాల వరకు ఉత్పత్తి అవుతోంది. పసుపుపంటను అవసరానికి మించి వేస్తున్నారు.

07/02/2019 - 02:53

మన రూపాయి విలువ నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అనే విధంగా పాతాళానికి పడిపోతుంది. దీనికి కారణం ఏమిటి అనేది భేతాళ ప్రశ్నలా తయారయింది. సాధారణంగా ఏ దేశమైనా తమ దేశం ద్రవ్యరాశి విలువకు సమానమైన బంగారపు నిల్వలు ఉండే విధంగా జాగ్రత్తపడతారు.

Pages