S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘అమ్మో.. అంత శిక్ష భరించలేను. ఇకనుంచి నువ్వు మాట్లాడమన్నపుడు తప్ప నోరెత్తను. సరేనా?’’
‘‘ఉహూ.. నువ్వు కీ ఇస్తే ఆడే బొమ్మలా ఉండేటట్టయితే ఇట్నించిటే ఇంటికి వెళ్లిపోదాం..’’ అందామె ఆట పట్టిస్తూ.
‘‘సరే.. సరే.. అప్పుడప్పుడూ మాత్రమే నువ్వు చెప్పినట్టు నడుచుకుంటూ ఎక్కువసార్లు నేను స్వయంగా ఆలోచించే ఏ పనైనా చేస్తాను, సరేనా?’’ అన్నాడు.
ప్రస్తుతం అందరి దృష్టి బాహుబలి-2 పైనే వుంది. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే ఆసక్తితో తెరకెక్కుతున్న రెండో భాగం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజవౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు చాటిన చిత్రం బాహుబలి.
ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని చివరి పాటను ఇటీవలే హైదరాబాద్లో చిత్రీకరించారు. అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..
మాగంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కందవాడలో షూటింగ్ జరుగుతోంది. ఆర్వైజె శ్రీరాజా దర్శకత్వంలో జి.రమేష్ రూపొందిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం దర్శకుడు శ్రీరాజా మాట్లాడుతూ రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ ప్రేమకథలో వైవిధ్యమైన కథనం ఉంటుందని, కొత్త నటీనటులు పరిచయవౌతున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందుతోందని తెలిపారు.
ఈమధ్యే అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ ఆ సినిమా తర్వాత మళ్లీ చారిత్రక నేపథ్యంలో ‘ప్రతాపరుద్రుడు’ సినిమాను తెరకెక్కిస్తానని చెప్పాడు. దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా మొదలుపెట్టిన ఆయన ఈ సినిమా విషయం పక్కనపెట్టి తాజాగా ‘హిరణ్యకశప’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..
తమిళంలో విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో వై.శేషిరెడ్డి అందిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈమధ్య హాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ స్టార్ల ప్రవేశం ఎక్కువగానే వుంది. ముఖ్యంగా కొన్ని రోజులుగా బాలీవుడ్ భామలు దీపిక, ప్రియాంకల గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీపిక హాలీవుడ్లో రూపొందుతున్న సంచలన చిత్రం ‘ట్రిపుల్ఎక్స్’లో నటిస్తోంది. ఆ టీజర్ ఇటీవలే విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. ఆ టీజర్లో హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించింది దీపిక.
సన్నీ, ప్రశాంత్, ప్రసన్న, అక్చిత ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై శివశ్రీ దర్శకత్వంలో డాక్టర్ మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి.. నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా ఆడియో వేడుక వైజాగ్ ఆర్కె బీచ్లో నిర్వహించారు.