S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 01:55

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు నిరాశకు గురిచేసింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సీ ఫుడ్ షో ముగింపు రోజు ఆదివారం ఎగ్జిబిషన్‌కు సందర్శకులను అనుమతిస్తామని నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. ఎంపెడా, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌ను సందర్శించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.

09/26/2016 - 01:54

బుచ్చెయ్యపేట, సెప్టెంబర్ 25: పాఠశాలల్లో వంటశాలలు నిర్మాణానికి పుష్కలంగా నిధులున్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల అలసత్వమైతే నేమి, స్థానిక ఉన్న సర్పంచ్‌లు, స్కూల్ కమిటీలు సహకరించకపోవటంతో వంటశాలల నిర్మాణాలు జరగక, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడరానిపాట్లు పుడుతున్నారు.

09/26/2016 - 01:54

చోడవరం, సెప్టెంబర్ 25: అల్పపీడనం ప్రభావంతో శనివారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. పట్టణంలో అనేక కాలనీలు నీటమునిగాయి. అర్ధరాత్రి 12గంటల నుండి మూడు గంటల వరకు వర్షం బీభత్సం సృష్టించింది. ద్వారకానగర్, రెల్లికాలనీ, బాలాజీనగర్, చైత్రానగర్, కోఆపరేటీవ్ కాలనీ, బానయ్య కోనేరు, దుడ్డు వీధి, గోవిందమ్మకాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

09/26/2016 - 01:52

విజయనగరం (పూల్‌బాగ్),సెప్టెంబర్ 25: దేశ ఆర్ధికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుందని జెడ్పీచైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని యునైటెడ్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ విద్యార్థులు ఆదివారం దక్షిణాది రాష్ట్రాల వంటకాలు, సంస్కృతి ప్రదర్శనలు నిర్వహించారు.

09/26/2016 - 01:52

విజయనగరం(పూల్‌బాగ్),సెప్టెంబర్ 25: వైభవంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు ఆదివారం పందిరి రాటతో శ్రీకారం చుట్టారు. చదురుగుడి ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు, వనంగుడి ప్రాంగణంలో ఉదయం పది గంటలకు మేళతాళాలతో, వేదమంత్రాల నడుమ పందిరిరాటను వేశారు.

09/26/2016 - 01:51

వేపాడ, సెప్టెంబర్ 25: వేపాడ పంచాయతీ శివారు బక్కునాయుడుపేటలో ఆదివారం వేకువ జామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో మిద్దె ఇల్లు కూలిపోయి భార్యభర్తలు మృతి చెందారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిగోడలు పూర్తిగా నానిపోవడంతో మిద్దె ఇల్లు ఆకస్మికంగా కూలిపోయింది. ఈ సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న కర్రి అప్పారావు(70), భార్య నాగరాజు(65) మృతి చెందారు.

09/26/2016 - 01:50

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 25: పట్టణంలో శివారు ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల రూపంలో మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదని, మున్సిపల్ పాలకవర్గసభ్యులు కూడా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజల వాపోతున్నారు.

09/26/2016 - 01:25

ఏలూరు, సెప్టెంబర్ 25 : ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో 40 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళకు డెంగూ వ్యాధి వచ్చినట్లు గుర్తించి ఆమెను వైద్య ఆరోగ్య శాఖ వారు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం కాదని వైద్యాధికారులు పేర్కొన్నారు.

09/26/2016 - 01:24

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 25: యువత అపజయాలను లెక్కచేయకుండా లక్ష్య సాధన వైపు గురిపెడితే ఎప్పటికైనా విజయం వరిస్తుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ రజత పతక విజేత పివి సింధు అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

09/26/2016 - 01:24

ఏలూరు, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు అయిదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లాస్థాయి బ్యాంకర్లతో ఆయన బ్రాహ్మణులకు రుణాలందించే విషయంపై సమీక్షించారు.

Pages