S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
09/23/2016 - 01:03

హైదరాబాద్, సెప్టెంబర్ 22: పార్టీ మారిన 12 మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు ఏపిలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోంది. 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన విషయం తెలిసిందే.

09/23/2016 - 01:00

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన గురువారం చేపట్టిన రిహార్సల్స్ విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్‌కేంద్రం నుంచి ఈ నెల 26న ప్రయోగించే ఈ రాకెట్‌కు సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగాన్ని (రిహార్సల్) గురువారం షార్‌లో శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు.

09/23/2016 - 00:57

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ఎఐసిసినుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్‌యాత్రకు ఏపి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం సంఘీభావం తెలిపింది.

09/23/2016 - 00:55

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ మెడికల్ కౌనె్సలింగ్‌లో తప్పనిసరి సీట్లు దక్కుతాయని భావించిన విద్యార్ధులకు ఆశాభంగమే ఎదురైంది. మంచి ర్యాంకులు సాధించినా తక్కువ సంఖ్యలో కన్వీనర్ కోటా సీట్లు ఉండటంతో విద్యార్ధులకు సీట్లు దక్కలేదు. దాంతో విద్యార్ధులు హతాశులయ్యారు. రిజర్వుడ్ కేటగిరిల్లో కూడా అభ్యర్ధులకు సీట్లు దక్కలేదు.

09/23/2016 - 00:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వెనుకబడిన ప్రాంతం అయిన అరకుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీనీ కోరినట్లు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు.గురువారం ప్రధానిని కలిసిన అనంతరం గీత విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని గ్రామీణ సడక్ యోజన కింద నిధులివ్వాలని కోరామన్నారు.

09/23/2016 - 00:51

విజయవాడ, సెప్టెంబర్ 22: బిసిల్లో వేల మందిని యువ పారిశ్రామికవేత్తలుగా తయారుచేయటానికి 25 లక్షల రూపాయలతో చిన్న యూనిట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పిస్తున్నట్లు బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సంచార జాతులకు చెందిన 26 కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

09/23/2016 - 00:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సంవత్సరానికి కోటిన్నర రూపాయిల టర్నోవర్ ఉన్న పరిశ్రమలు, సంస్థలన్నింటిపైనా రాష్ట్రాలకే నియంత్రణ ఉండాలని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి స్పష్టం చేశారు. గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు.

09/23/2016 - 00:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జీఎస్టీ రేటు పరిధిని 18 శాతం నుంచి 20 శాతం ఉండేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్వర్యంలో జరిగిన జీఎస్టీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మూఖ్యంగా జీఎస్టీ రేటులో మినహాయింపులు ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు ఆయన తెలిపారు.

09/23/2016 - 00:47

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అవినీతి, అక్రమాలను , దళారీ వ్యవస్థను నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పౌర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. మరో పక్క భూమి రికార్డులను డిజిటలైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

09/23/2016 - 00:46

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ముందస్తు కార్యాచరణ, శాఖల మధ్య సమన్వయలోపం కలసి వెరసి పురాతన భవనాల్లో నివసిస్తున్న వారికి శాపంగా పరిణమించింది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు హడావిడి చేయడం, తర్వాత మర్చిపోవడం తంతుగా మారింది.

Pages