S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉత్తరప్రదేశ్లోని కొన్ని ఆస్పత్రుల్లో అధికారులు రోగులపట్ల నిర్దయగా ప్రవర్తించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మీర్జాపూర్ ఆస్పత్రిలో 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్న తన కోడలిని భుజాలపై మోసుకుపోవలసిన పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎన్హెచ్ఆర్సి ఆ కథనాలపై తీవ్రంగా స్పందించింది.
ముంబయి, సెప్టెంబర్ 22: వడ్డీ రేట్లను కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బిఎస్ఇ సెనె్సక్స్ 266 పాయింట్లు లాభపడి రెండు వారాల గరిష్ఠ స్థాయి అయిన 28,773.13 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎఖ్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 90.30 పాయింట్లు లాభపడి మళ్లీ 8,800 పాయింట్ల ఎగువన ముగిసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: స్మార్ట్ సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్న విశాఖపట్టణానికి సరికొత్త దశ పట్టనుంది. ఇక మీదట వైజాగ్ ప్రముఖ ఐటి హబ్గా సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చెందనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. దీనికి ఐటి వర్గాల నుండి కూడా సానుకూల స్పందన వస్తోంది. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటి టౌన్షిప్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అయిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా రూ. 820 కోట్లకు పైగా సేకరించగలుగుతామని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే తదుపరి విడుదల చేయబోయే గోల్డ్ బాండ్స్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్సతో దీపావళికి ముందే విడుదల చేయాలని కూడా భావిస్తోంది. ‘అయిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా వచ్చే మొత్తం రూ, 820 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నాం.
సింగపూర్, సెప్టెంబర్ 22: దేశంలో అత్యధికంగా సంపదను సృష్టించే ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో గుజరాతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్లోని అత్యంత సంపన్నులైన 100 మందితో ప్రముఖ పత్రిక ‘్ఫర్బ్స్’ గురువారం విడుదల చేసిన జాబితాలో అంబానీలు, అదానీలు, సంఘ్వీలు, పటేళ్లు సహా గుజరాత్కు చెందిన పలువురు ప్రముఖ స్థానాలను ఆక్రమించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: చెక్ బౌన్స్ కేసులో కింగ్ ఫిషర్ పూర్వ ప్రధాన ఆర్ధిక శాఖాధికారి రఘునాథన్కు ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. అనంరం ఈ తీర్పుపై హైకోర్టుకు అపీల్కు వెళ్లేందుకు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిఎంఆర్ సంస్ధకు ఇచ్చిన చెక్ల బౌన్సు కేసులో లండన్కు వెళ్లిపోయిన వాణిజ్యవేత్త విజయ్ మాల్యా, రఘునాథన్లపై కేసు నమోదైంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో రుతుపవనాలు మెరుగ్గా ఉండటంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆల్టైమ్ రికార్డు స్థాయికి పెరుగుతుందని, గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 124.01 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది 135.03 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.
కాకినాడ, సెప్టెంబర్ 22: తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా కృష్ణా-గోదావరి బేసిన్ (కెజి బేసిన్)లో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికి తీస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి తగిన వాటాను సాధించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబయి, సెప్టెంబర్ 22: ఆదాయ ధ్రువీకరణ పథకాన్ని (ఐడిఎస్) విజయవంతం చేసేందుకు ఆ శాఖ అధికారులు ఏ అవకాశాన్ని వదలడం లేదు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంల సంపన్నులైన మదుపరులు తమ సొమ్మును సరయిన వాటిలోనే పెట్టుబడులు పెడతారని పోర్ట్ఫులియో మేనేజర్లపై విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఆగస్టు చివరి నాటికి భారతీయ పెట్టుబడుల మార్కెట్లో మదుపరులకు సలహాపూర్వక సేవలందించే ఈ సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తులు రూ.11.4 లక్షల కోట్లకు పెరిగి పోయాయి.