S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్టీఆర్ కొత్త సినిమాపై మీడియా వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, నిజ జీవిత పాత్రలతో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సినిమాలు తీసే బాల దర్శకత్వంలో నటిస్తాడనేది ఇప్పుడు అందరినీ ఆశ్ఛర్యపరుస్తున్న వార్త. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా నిశాంత్ దర్శకత్వంలో మీడియా వాల్ స్టోరీ టెల్లర్స్ పతాకంపై పూదారి అరుణ నిర్మించిన చిత్రం ‘బొమ్మల రామారం’. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత పూదారి అరుణ వివరాలు తెలియజేస్తూ, ఇటీవల విడుదలైన ట్రైలర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా అనుకున్న విధంగా తెరకెక్కించాం.
రామ్, రాశీఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హైపర్’. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే క్యాప్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది.
పద్నాలుగేళ్లుగా ఏళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో సంతోషం అవార్డుల పేరిట కొండేటి సురేష్ అందిస్తున్న విషయం తెలిసిందే. సంతోషం సినీ వారపత్రిక ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ అవార్డు వేడుకలు ఈనెల 14న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హీరో నిఖిల్, కాథరీన్, తమన్, శివాజీరాజా, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
జ్ఞాన్, సూర్యశ్రీనివాస్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో పరంద్ కళ్యాణ్ దర్శత్వంలో రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భాషా మజహర్ నిర్మిస్తున్న చిత్రం ‘నేనొస్తా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆవిష్కరించారు.
మెగా ఫ్యామిలీనుండి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ‘గౌరవం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిరీష్, ఆ తరువాత కొత్తజంట చిత్రంలో నటించాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన నటించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా అల్లు శిరీష్తో ఇంటర్వ్యూ..
‘కొత్తజంట’ తరువాత ఎక్కువ గ్యాప్?
ఆనంద్ కృష్ణ, శిల్ప జంటగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో నీలిమ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్నివ్వగా, ప్రతాని రామకృష్ణగౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు.
హైదరాబాద్: 123 జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇది రైతులు, రైతు కూలీల విజయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 123 జీవో రద్దు సందర్భంగా గాంధీభవన్లో కాంగ్రెస్ సంబరాలు నిర్వహించింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్ కళ్ళు తెరవాలని ఉత్తమ్ సూచించారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి ఈ నెల 7న రాష్ట్రానికి రానున్న సందర్భంగా గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించారు. మిషన్ భగీరథను ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన గజ్వేల్లో ప్రధాని ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాలను మోదీ గజ్వేల్ నుంచే ప్రారంభిస్తారు.
హైదరాబాద్: ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించామని టీజేఏసీ నేత కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 123 జీవోతో అన్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారని చెప్పారు.