S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 16:42

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఉంటున్న సినీ నటి విజయశాంతి ఇంట్లో బంగారు నగలు కాజేసింది పనిమనిషేనని పోలీసుల విచారణలో తేలింది. విజయశాంతి ఇంట్లో గాజులు, వజ్రాలు పొదిగిన చెవిదుద్దులు, ఉంగరం అయిదురోజుల క్రితం మాయమయ్యాయి. ఈ విషయమై విజయశాంతి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టి ‘ఇంటిదొంగ’ను కనిపెట్టారు.

06/18/2016 - 16:41

మెదక్: బలవంతపు భూసేకరణకు కొందరు నాయకులు సహకరిస్తున్నారంటూ మెదక్ జిల్లా ఏడిగెడ్డ కృష్ణాపూర్‌లో రైతులు శనివారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎంపిటిసి సభ్యుడు ప్రతాపరెడ్డికి చెందిన వ్యవసాయ పనిముట్లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రామ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

06/18/2016 - 16:41

హైదరాబాద్: సింగూరు వరకూ కొమురెల్లి మల్లన్నసాగర్ జలాశయం నీటిని తరలించేందుకు నివేదికను సిద్ధం చేయాలని తెలంగాణ సర్కారు శనివారం అధికారులను ఆదేశించింది. మల్లన్నసాగర్ జలాశయాన్ని నిర్మించాలని తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులు, తెరాస కార్యకర్తలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

06/18/2016 - 16:40

హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీనటుడు మోహన్‌బాబు పెద్ద కోడలు (మంచు విష్ణు భార్య) వెరోనిక స్వల్పంగా గాయపడ్డారు. మామిడిపల్లి నుంచి వస్తున్న కారు, వెరోనిక ప్రయాణిస్తున్న కారు పరస్పరం ఢీకొన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే మోహన్‌బాబు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

06/18/2016 - 16:40

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సౌకర్యార్థం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 20న రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారు. ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ కొత్త రైలును ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈనెల 22 నుంచి ఈ రైలు వారానికి ఆరుసార్లు (ఆదివారం తప్ప) నడుస్తుంది.

06/18/2016 - 16:39

హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న హైదరాబాద్‌లో వంద మసీదుల్లో, తెలంగాణ జిల్లాల్లో 95 నియోజకవర్గ కేంద్రాల్లో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విందు సందర్భంగా రెండు లక్షల మంది పేద ముస్లింలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తారు. నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ఆరువేల మందికి విందు ఇస్తారు.

06/18/2016 - 16:39

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి 1.33 కోట్ల రూపాయలతో ఉడాయించి పోలీసులకు పట్టుబడిన నకిలీబాబా శివానందను శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. శివానందతో పాటు ఆయన అనుచరులిద్దరినీ ఈనెల 28 వరకూ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

06/18/2016 - 16:38

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన విధానాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నాయని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఆయన శనివారం నగర శివారులోని ఆదిభట్ల వద్ద టాటా-బోయింగ్ ఏర్‌స్పేస్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రగతికి కేంద్రం అన్ని విధాలా స్నేహహస్తం అందిస్తుందన్నారు.

06/18/2016 - 16:37

రేపు కూకట్‌పల్లిలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

06/18/2016 - 13:56

హైదరాబాద్ : తొలిసారిగా యుద్ధ విమాన పైలెట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు యువతులు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. దుండిగల్లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 130పైలెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు.

Pages