-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
రాజేంద్రనగర్, జూన్ 14: శంషాబాద్లోని తొండుపల్లి గ్రామ శివారులో రైలు పట్టాల సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని, గుర్తుతెలియని దుండగులు ఇనుపరాడ్తో తలపై బలంగా మోది హత్య చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తికి దాదాపు 45 సంవత్సరాల వయస్సు వుంటుందని తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 14: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), కమల్నాథ్ (మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లోట్ (రాజస్థాన్ ), భూపేష్ భగేల్ (చత్తీస్గఢ్) భవిష్యత్ కార్యచరణపై దృష్టి సారించినట్లు తెలిసింది.
న్యూఢిల్లీ, జూన్ 14: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్-2019 ప్రశ్నాపత్రం ‘కీ’ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కింది కోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్కు అత్యున్నత ధర్మాసనం వెసులుబాటు కల్పించింది.
విజయవాడ (క్రైం), జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గతంలో విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) హైకోర్టును ఆశ్రయించింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అతని బెయిల్ను రద్దు చేయాల్సిందిగా విఙ్ఞప్తి చేసింది.
వినుకొండ, జూన్ 14: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సీలేరు, జూన్ 14: విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు కీలక ప్రదేశంలో సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో ఆ ప్రాంతానికి గ్రేహౌండ్స్ బలగాలను తరలించారు. ఈ సమావేశంలో మావోయిస్టు కీలక నేతలు హాజరవుతారన్న సమాచారంతో ఎనిమిది గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా తనిఖీలు చేసారు.
ఖమ్మం, జూన్ 14: తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంఖేర్ జిల్లాలో భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య సు మారు గంట సేపు కాల్పులు జరిగా యి.
ఇచ్చోడ, జూన్ 14: ఆదిలాబాద్ జిల్ల్లాలో 25 లక్షల విలువైన నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో శుక్రవారం నకిలీ విత్తనాలను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నకిలీ విత్తనాల విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి కైలాస్ తెలిపారు.
బొబ్బిలి, జూన్ 14: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రోత్ సెంటర్లోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో 52 మంది కార్మికులు పని చేస్తుండగా శుక్రవారం ఉదయం 22 మంది విధులకు హాజరయ్యారు. సుమారు 10 గంటల సమయంలో బాయిలర్ పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
రంపచోడవరం, జూన్ 14: జ్వరంతో మృతిచెందిన రెండు నెలల పసికందు మృతదేహాన్ని స్వగ్రామం తరలించే అవకాశం లేక సుమారు ఎనిమిది గంటలు ఒడిలోనే పెట్టుకుని ఆసుపత్రి ఆవరణలోని కుర్చీలో నిస్సహాయంగా కూర్చుండిపోయిన మాతృమూర్తి దయనీయ గాథ ఇది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...