-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పాయకాపురం, జూన్ 12: అజిత్సింగ్ నగర్ ఫ్లైఓవర్పై ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం తాగిన మత్తులో పగడాల దుర్గారావు, శివ, ఆరిఫ్ తమ బాక్సర్ బైక్పై సింగ్నగర్ నుండి నగరంలోని ఫుడ్ కోర్టుకు బయలుదేరారు.
విజయవాడ, జూన్ 12: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి కనీసం గుర్తింపు లేకుండానే ఏడాది కాలంగా ఒకటి నుంచి 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులతో సత్యనారాయణపురంలో నడుస్తున్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను పునఃప్రారంభం రోజే జిల్లా ఉప విద్యాశాఖాధికారి రవికుమార్ సీజ్ చేశారు. ఈ హఠాత్ పరిణామం పట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు కంగుతిన్నారు.
గజ్వేల్, ములుగు, జూన్ 12: విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో రూ. 34 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాదారంలో బుధవారం చోటు చేసుకుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ మనోహర్, జేడీఏ శ్రావణ్కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి.
మిర్యాలగూడ టౌన్, జూన్ 12: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గత ఏడాది సెప్టెంబర్ 14న ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడు పీ.ప్రణయ్కుమార్ హత్య కేసులో పోలీసులు 1,600 పేజీల చార్జిషీటును సిద్ధం చేసి నల్లగొండ కోర్టులో సమర్పించేందుకు బుధవారం వెళ్లారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్కుమార్ హత్యలో పోలీసు అధికారులు అన్ని కోణాల నుండి దర్యాప్తు కొనసాగించారు.
న్యూఢిల్లీ, జూన్ 12: ఎయిమ్స్లోని కేఫరేటిరియా కాంట్రాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ప్రైవేటు కాంట్రాక్టర్ ఆహారం, ఇతర తినుబండారాల ధరలను విపరీతంగా పెంచి, సిబ్బందిని, రోగులను ఇబ్బందులపాలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. చాలాకాలంగా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేఫరేటియా కాంట్రాక్టర్పై ఎయిమ్స్ ఉద్యోగుల సంఘం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పనాజీ: ఓ ఛీటింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ బుధవారం గోవాలోని కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. ఓ ఛీటింగ్ కేసులో వినోద్ దేశాయ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే సదరు వ్యక్తి తాను లోగడ శ్రీపాద నాయక్ వద్ద పని చేశానని నమ్మించి మోసగించాడు.
జైపూర్: మైనర్ బాలికపై అత్యాచారం, హతమార్చిన కేసులో ఓ వ్యక్తికి అల్వార్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్ కుమార్ అలియాస్ ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పోస్కో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ శర్మ కేసును విచారించిన తర్వాత బుధవారం తీర్పును వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి ఇళ్లపై సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసు నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమేథీలో ఆయనకున్న మూడిళ్లలో సోదాలు జరిపినట్టు వారు తెలిపారు. అదేవిధంగా అమీర్పూర్ జిల్లాలో, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లోని 11 స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
జగదేవ్పూర్, జూన్ 11: ఆడుకుంటూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో జారి పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
గూడూరు, జూన్ 11: నీటి తొట్టెలో పడి ఏడాది వయస్సు గల చిన్నారి మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్ రెండవ కుమార్తె అభినయ (01) మంగళవారం ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడిపోయింది. అభినయ నీటి తొట్టెలో పడిపోయిన విషయాన్ని తల్లితండ్రులు గమనించలేదు.