S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/19/2019 - 01:52

షాబాద్, జూన్ 18: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ప్రతేక్ష్య సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని మాచన్‌పల్లి గ్రామానికి చెందిన ఎలికే అశోక్(55) సర్దర్‌నగర్ సంతకు వెళ్లి ఇంటికి అవసరమైన కూరగాయాలు తీసుకొని వెళ్తుండగా ఆస్పలిగూడ స్టేజీ దగ్గర బైకు అదుపు తప్పి పడిపోవడంతో అతని తలకు గట్టిగా దెబ్బతగలడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

06/19/2019 - 01:51

ఇబ్రహీంపట్నం, జూన్ 18: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వెంచర్లపై హెచ్‌ఎండీఏ అధికారులు కొరడా ఝులుపించారు. ఇబ్రహీంపట్నం నగరపంచాయతీ పరిధిలోని మూడు ప్రైవేటు వెంచర్లతో పాటు, నాగాన్‌పల్లి గ్రామ సమీపంలోని నాలుగు వెంచర్లలో హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారిని శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు నిర్మాణాలను కూల్చి వేశారు.

06/19/2019 - 01:50

షాద్‌నగర్ రూరల్, జూన్ 18: పట్టపగలు 44వ జాతీయ రహదారిపై యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన ఫరూఖ్‌భగర్ మండలం బూర్గుల గేటు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. షాద్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. యువకుడు బుల్లెట్ బైక్‌పై వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి పాన్‌కార్డు, బుల్లెట్‌బైక్ నంబర్ వివరాల ప్రకారం..

06/19/2019 - 01:50

తాండూరు, జూన్ 18: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పేద విద్యార్థి వీరేందర్ (14) ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడినట్లు తెలిసింది. స్థానిక ఇందిరా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభ కుమారుడు వీరేందర్.. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటానని తల్లితో మరాం చేశాడు.

06/19/2019 - 01:49

గచ్చిబౌలి, జూన్ 18: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో కారు బీభత్సం సృష్టించింది. లైసన్స్ లేకుండా కారు నడపడంతో పాటు సిగ్నల్ జంప్ చేసి రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులను డ్రైవర్ ఢీ కొట్టాడు. ప్రమాదానికి ప్రధాన కారకుడైన వ్యక్తి విద్యార్ధి కావడంతో కాపాడేందుకు పోలీసులు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/19/2019 - 01:21

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం మరోమారు వాదనలు జరిగాయి. నిర్ణయాన్ని హైకోర్టు రిజర్వు చేసింది. గతంలో ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగిన అనంతరం హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అహ్లువాలియా వాదనలు వినిపించారు.

06/18/2019 - 23:27

అలహాబాద్, జూన్ 18: అయోధ్యలో 2005 నాటి ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రత్యేక కోర్టు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.. ఒకరిని విడుదల చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు స్థానికులు మృతి చెందగా.. ఏడుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితులు నలుగురూ 2.4 లక్షల చొప్పున జరిమానాను ప్రత్యేక జడ్జి దినేష్ చంద్ర విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురాబ్ చంద్ర అగ్రహారీ మంగళవారం విలేఖరులకు తెలిపారు.

06/18/2019 - 23:05

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులకు రక్షణ కల్పించాల్సిందిగా దాఖలైన పిటీషన్‌పై సుప్రీం కోర్టు కేసును వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు సమ్మె బాట పట్టగా, వారికి మద్దతుగా దేశ వ్యాప్తంగా వైద్యులు సోమవారం ఒక రోజు సమ్మె చేసి సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.

06/18/2019 - 04:54

పులివెందుల, జూన్ 17: విద్యుత్ తీగలు తెగి మీదపడడంతో మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సజీవదహనమయ్యారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతులిద్దరూ మాజీ సైనికులు కావడం గమనార్హం. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/18/2019 - 04:51

మొగల్తూరు, జూన్ 17: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ దేవతల జాతర ముగింపు నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనోత్సవంలో భాగంగా వెస్ట్ కుక్కులేరు డ్రెయినులో స్నానం చేస్తున్న సమయంలో నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మునిగిపోతున్న మరో నలుగురిని స్థానికుడు ఒకరు రక్షించారు. వివరాలిలావున్నాయి...

Pages