S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/26/2019 - 04:42

ధర్మారం, మార్చి 25: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న ఏపీ.15ఎసి.3358 అనే నంబర్ గల కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే గల చెట్టును బలంగా ఢీకొట్టడంతో కారు నడుపుతున్న కొడిమ్యాలకు చెందిన కొండూరి మనోహర్ (56) అక్కడికక్కడే మృతి చెందగా, అందులో ప్రయాణిస్తున్న రాగి వీరేశం (78) కూడా మృతి చెందాడు.

03/26/2019 - 04:01

సబ్బవరం, మార్చి 25: విశాఖ జిల్లా సబ్బవరం మండలం మండలంలోని గుల్లేపల్లి సమీపంలోని శ్రీ భూలోకమాంబ ఫైర్ వర్క్స్‌లో సోమవారం సంభవించిన పేలుడులో ఇద్దరు మృత్యువాత పడగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం భూలోకమాంబ ఫైర్ వర్క్స్ పేరిట ఎలాంటి అనుమతి లేకుండా దాసరి సత్యనారాయణ అనే వ్యిక్తి బాణసంచా తయారు చేస్తున్నాడు.

03/26/2019 - 03:59

పెద్దమండ్యం, మార్చి 25: 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళిన విద్యార్థులు వాహన రూపంలో వచ్చి మృత్యువాత పడిన సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాలు కాగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు, పోలీసుల కథనం మేరకు ఇలా వున్నాయి.

03/26/2019 - 05:03

న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పథకంలో ఇంజినీరింగ్ స్ట్ఫా కాలేజీ అంచానాలను బీహెచ్‌ఈఎల్, మెగా, నవయుగ సంస్థలు భారీగా పెంచాయని, దీనిద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

03/26/2019 - 01:31

మెహిదీపట్నం, మార్చి 25: కూతురుపై మారు తండ్రి పలు మార్లు అత్యాచారం చేసిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలు మైనర్ బాలికను ప్రశ్నిస్తే జరిగిన విషయం తెలిపింది. గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కోమరయ్య కథనం ప్రకారం... రాందేవ్‌గూడకు చెందిన షానాజ్ గత కొన్ని సంవత్సరాల క్రితం నూర్ హైమాద్‌తో పెంళ్లి జరిగింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు కూతుర్లు.

03/26/2019 - 01:30

ఉప్పల్, మార్చి 25: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లక్ష్మీనారాయణ కాలనీలో నివాసముండే అద్దంకి దయాకర్(30) ఆటో డ్రైవర్. దయాకర్ తన ఆటోలో రామాంతాపూర్ నుంచి ఇంటి వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొంది. తీవ్ర గాయాలకు గురైన దయాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

03/26/2019 - 01:29

కుషాయిగూడ, మార్చి 25: చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ భాస్కర్ తెలిపిన కథనం ప్రకారం.. శంకర్ నాయక్(21), హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలికపై వేధింపులకు పాల్పడిన కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.

03/26/2019 - 01:29

మేడ్చల్, మార్చి 25: కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండల డబిల్‌పూర్ గ్రామానికి చెందిన సంతోష్(31) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో సంతోష్ భార్య అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయింది.

03/26/2019 - 01:28

శేరిలింగంపల్లి, మార్చి 25: రాజస్థానీ బాలుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన జగదీష్ చౌదరి నల్లగండ్లలోని తన ప్లైవుడ్ షాపులో పని చేయడానికి అల్లుడు వరుసైన ముఖేష్ (19)ను ఏడు నెలల క్రితం స్వగ్రామం నుంచి తీసుకువచ్చాడు. తన ఇంట్లోనే ఉంటూ దుకాణంలో పని చేస్తుండగా సోమవారం ఉదయం ఆరు గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు.

03/26/2019 - 01:28

కొందుర్గు, మార్చి 25: మహిళా సమాఖ్యలో రెండు లక్షల రూపాయల నిధులు గోల్‌మాల్ అయిన సంఘటన జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని రావిర్యాల, వీరసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. స్ర్తి నిధి బ్యాంక్‌లో తీసుకున్న రుణాలను చెల్లించే విషయంలో గ్రామ మహిళా సంఘాల సభ్యులు ప్రతినెల డబ్బులు బుక్‌కీపర్‌కు, సీసీలకు చెల్లించినప్పటికి ఆ డబ్బులు స్ర్తి నిధి బ్యాంక్ ఖాతాలో జమచేయలేదని మహిళా సంఘాల సభ్యులు వివరించారు.

Pages