S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/28/2019 - 04:48

హైదరాబాద్, మార్చి 27: ఐటీగ్రిడ్స్ డేటా కుంభకోణంపై బుధవారం హైకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఐటీగ్రిడ్స్ డేటా కుంభకోణంపై విచారణ చేపట్టారు. ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను విన్న తరువాత కేసును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీగ్రిడ్స్ యాప్‌లో ఉందని లోకేశ్వరరెడ్డి సైబరాబాద్ కమిషనకు ఇచ్చిన విషయం తెల్సిందే.

03/28/2019 - 04:32

న్యూఢిల్లీ, మార్చి 27: సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాతోబాటు మరికొంత మందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ బుధవారం ఢిల్లీ హైకోర్టును కోరింది. గత జనవరి 11న హైకోర్టు ఇచ్చిన 10 వారాల కాలవ్యవధి ముగిసిపోవడంతో దాన్ని పొడిగించాల్సిందిగా సీబీఐ అధికారులు అత్యున్నత న్యాయస్థానానికి దరఖాస్తు చేశారు.

03/28/2019 - 01:24

దిల్‌సుఖ్‌నగర్, మార్చి 27: కోటి ఎనభై లక్షల రూపాయల నగదు పట్టుకున్న సంఘటన చైతన్యపురి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్కేపురం ప్రాంతానికి చెందిన టాటావెంకట శివ మహేశ్వర రావు వృత్తిరిత్యా వ్యాపారీ అతను మంగళవారం రాత్రి వ్యాపార కార్యకలాపాలు ముగించుకొని ఇంటికి తన కారులో వెళ్లుతున్నాడు.

03/28/2019 - 01:24

ఉప్పల్, మార్చి 27: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ లక్ష్మినగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కే.ఉపేందర్ (32) ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తక్కువ జీతంతో కుటుంబపోషణ బరువై అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్య పిల్లలు వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయారు.

03/28/2019 - 01:23

ఘట్‌కేసర్, మార్చి 27: ఐపిఎల్ టీ-20 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి నగదు, సెల్‌ఫోన్లు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి వెంకటాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ విజయకృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి జరిపినట్లు తెలిపారు.

03/28/2019 - 01:23

ఉప్పల్, మార్చి 27: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వెహికిల్ చెకింగ్ ముమ్మరంగా జరుగుతోంది. స్పెషల్ ఆపరేషన్ టీం, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో రామంతాపూర్ చెరువుకట్టపై మంగళవారం రాత్రి వెహికిల్ చెక్ చేస్తుండగా అదే సమయంలో ఉప్పల్ నుంచి వచ్చే బైక్‌ను ఆపారు. బైక్‌ను నడిపే ప్రవీణ్ కుమార్ వద్ద బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో రూ.10లక్షల 30వేలు ఉన్నాయి.

03/27/2019 - 04:06

అల్వాల్, మార్చి 26: యువకుని జేబులోని సెల్‌ఫోన్ ప్రమాదవశాత్తు పేలి గాయాలై ఆసుపత్రి పాలైన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధి మచ్చబొల్లారంలో జరిగింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం - మచ్చబొల్లారం నివాసి ఇమ్రాన్ ఇటీవల ఒప్పో డిజిటల్ ఫోన్ ఖరీదు చేశాడు. మంగళవారం ఉదయం తన బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎడమ భాగంలోని ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా అతిగా వేడెక్కి భారీ శబ్ధంతో పేలింది.

03/27/2019 - 04:06

ఉప్పల్, మార్చి 26: ఆస్తి మ్యూటేషన్ విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ పసుల వెంకటేశ్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అచ్చేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అటెండర్ ఐలేశ్వర్, కాంట్రాక్ట్ ఉద్యోగి గడ్డం నవీన్‌ను అరెస్టు చేయగా టాక్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

03/27/2019 - 04:02

సైదాబాద్, మార్చి 26: రెండు వాహనాలు డీకొన్న ప్రమాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి సద్దుమణిగింది. సోమవారం అర్ధరాత్రి 12గంటలకు సైదాబాద్‌లో ఒక ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని జాకీర్‌హుస్సేన్ కాలనీ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న మరో వర్గానికి చెందిన యువకుని వాహనాన్ని ఢీకొట్టింది.

03/26/2019 - 22:27

లండన్, మార్చి 26: ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు, రెండు బిలియన్ డాలర్ల మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ భారత్‌కు తిరిగి వచ్చేందుకు సమర్పించిన రెండో బెయిన్ పిటిషన్‌పై లండన్ కోర్టు ఈనెల 29న విచారణ చేపట్టనుంది.

Pages