S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2017 - 04:31

న్యూఢిల్లీ, మే 18: విదేశాలకు పారిపోవడం ద్వారా భారతీయ చట్టాల ప్రక్రియనుంచి తప్పించుకుంటున్న ఆర్థిక నేరాల భరతం పట్టడానికి కేంద్ర ప్రభు త్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకు వస్తోం ది. ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల బిల్లు-2017’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు వివరాలను ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

05/19/2017 - 04:30

శ్రీనగర్, మే 18:కేంద్ర ప్రభుత్వం చారిత్రక రీతిలో జూలై 1 నుంచి అమలు చేయతలపెట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి వచ్చే 90శాతం వస్తువుల రేట్లు ఖరారయ్యాయి. జన బాహుళ్యం ఎక్కువగా వినియోగించే వాటిపై పన్నులు తగ్గించారు. ఆహార ధాన్యాలు, బెల్లంను లెవీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. చక్కెర, టీ, వంటనూనెలపై కనిష్ట స్థాయిలో ఐదుశాతం మాత్రమే పన్ను ఉంటుంది.

05/19/2017 - 04:28

న్యూఢిల్లీ, మే 18: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్ త్వరలోనే ఆమోదం పొందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం తెలిపారు. ఈ విషయంలో కృషి చేసిన రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులను ఆయన అభినందించారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తనతో సమావేశమైనట్టు తెలిపారు.

05/18/2017 - 01:49

న్యూఢిల్లీ, మే 17: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌కు జూన్ రెండోవారంలోగా రాష్టప్రతి ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చిం ది. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఇప్పటికే కేంద్ర న్యాశాఖ అంగీకారం తెలిపినందున, పిఎంవో, కేంద్ర హోంశాఖల ఆమోదం లభింపచేసి రాష్టప్రతి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్న తెలుగు రాష్ట్రాలకు విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.

05/18/2017 - 01:47

న్యూఢిల్లీ, మే 17: దేశవ్యాప్తంగా అత్యంత స్వచ్ఛతగల ఏ-1 కేటగిరీ స్టేషన్లుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ రేల్వే స్టేషన్లు నిలిచాయి. ఈ స్టేషన్లకు ఒకటి, రెండు స్థానాలు లభించగా, నాలుగో స్థానంలో విజయవాడ రైల్వే స్టేషన్ నిలిచింది. అలాగే అత్యంత స్వచ్ఛతగల ఏ కేటగిరీ విభాగంలో ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ రైల్వే స్టేషన్లు స్థానాలు దక్కించుకున్నాయి.

05/18/2017 - 01:29

హేగ్, మే 17: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) గురువారం తీర్పు ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యాయస్థానం తీర్పు వెలువరించనుందని భారత అధికారులు తెలిపారు. గూఢచర్యం ఆరోపణలపై పాక్ మిలిటరీ అధికారులు జాదవ్‌ను గత ఏడాది అరెస్టు చేశారు. పాక్ సైనిక న్యాయస్థానం ఆయనకు ఇటీవలే మరణ శిక్ష విధించింది.

05/18/2017 - 01:28

న్యూఢిల్లీ, మే 17: ‘మా పార్టీ అభ్యర్థినే రాష్టప్రతి భవన్‌కు పంపిస్తాం. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు’ అని బిజెపి హైకమాండ్ ప్రతిపక్షానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. బిజెపి రాజకీయ చరిత్రలో తొలిసారి పార్టీ అభ్యర్థిని రాష్టప్రతిగా ఎన్నుకునే అవకాశం వచ్చింది.

05/18/2017 - 01:27

న్యూఢిల్లీ, మే 17: ట్రిపుల్ తలాఖ్ ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని, మెజారిటీ, మైనారిటీ సమస్యా కూడా కాదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు ఎదుట వాదించింది. ఇది ముస్లిం పురుషులు, అన్యాయానికి గురవుతున్న మహిళల మధ్య జరుగుతున్న సంఘర్షణేనని పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్ విధానంపై బలమైన రీతిలో న్యాయ సమీక్ష జరగాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు.

05/18/2017 - 01:25

న్యూఢిల్లీ, మే 17: గర్భిణీలు, బాలింతలకు రూ. 6 వేల చొప్పున మెటర్నిటీ బెనిఫిట్ అందించే కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. అయితే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన వారికే పథకాన్ని పరిమితం చేసింది. ‘తొలిసారి గర్భిణి లేదా తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన బాలింతకు రూ.6 వేలదాకా నగదు ప్రయోజనం అందుతుంది.

05/18/2017 - 01:23

న్యూఢిల్లీ, మే 17: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి గుంతకల్ వరకు ఉన్న 402 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్‌తోపాటు విద్యుద్దీకరణ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ప్రాజెక్టును ఆమోదం తెలిపారు.

Pages