మందకొడిగా పోలింగ్!
Published Wednesday, 30 August 2017కాకినాడ, ఆగస్టు 29: చెదురు మదురు ఘటనలు వినా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా సాగింది. పోలింగ్ మందకొడిగా కేవలం 64.78 శాతంగా నమోదయ్యింది. ఉదయం 7నుంచి నగరంలోని 48 డివిజన్లలో ఏర్పాటుచేసిన 196 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాగా, కొన్ని పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం వరకు ఓటర్లు కనిపించకపోవడం విశేషం. నగరపాలక సంస్థలోని 48 డివిజన్లలో 2 లక్షల 29వేల 373 మంది ఓటర్లకుగాను లక్ష 48వేల 598 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి.