విద్యారంగాన్ని సంస్కరించాలి
Published Monday, 12 December 2016ఖమ్మం, డిసెంబర్ 11: ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా విధానాలను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులో లేకుండా చేశారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు సంస్కరణలు అవసరమని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన టిపిటిఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే సంపద పోగుపడటం కాదని, ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపడటమని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు విద్యే ప్రధాన సాధనమన్నారు.