నూతన విద్యావిధానం విద్యారంగానికి చేటు
Published Monday, 12 December 2016విజయనగరం(టౌన్), డిసెంబర్ 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావిధానాలు ప్రభుత్వ రంగ విద్యకు చేటు కలిగించే విధంగా ఉన్నాయని, వీటిని తిప్పి కొట్టేందుకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎంవి ఎస్ శర్మ పిలుపు నిచ్చారు. ఎపి ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య 42వ రాష్ట్ర మహాసభలు ఆదివారం విజయనగరం పట్టణంలో ఘనంగా ప్రారంభయ్యాయి. రెండు రోజలు జరిగే సమావేశాల్లో విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి పూర్తిస్ధాయిలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.