పన్ను.. 50 శాతం!
Published Saturday, 26 November 2016నల్లధన కుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్తే చాలన్న ప్రకటన చేసింది. అయతే, బ్లాక్మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తీసుకొచ్చి బిల్లును పార్లమెంట్లో త్వరలోనే ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.